పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తరువాత దేశంలో అవినీతి తగ్గుతుందని అశించిన కేంద్ర ప్రభుత్వం.. వాటి ఫలితాలు వచ్చాయా..? లేదా..? అన్న విషయాలను మాత్రం వెల్లడించలేదు. ఇకపైపెచ్చు.. పాత పెద్ద నోట్ల రద్దు అంశాన్ని పక్కదారి పట్టించేందుకు డిజిటల్ ఇండియా, క్యాష్ లెస్ ఎకానమి దిశగా అడుగులేస్తున్నామని చెప్పుకోచ్చింది. ఇక అవినీతి సోమ్ము ఎంతమేరకు బయటపడిందన్న విషయాన్ని కూడా మరుగున పెట్టేసిన కేంద్రం.. ఉద్రవాద, అంతర్గత తీవ్రవాద సమస్యలకు పెద్ద నోట్ల రద్దు చెక్ పెట్టిందని చెప్పుకోచ్చింది.
నిజానికి పెద్దనోట్ల రద్దుతో బ్యాంకులు, ఏటీయంల క్యూలైన్లలో నిలబడిన పలువురు వయోవృద్దులు, యువకులు తమ ప్రాణాలను కోల్పోయారు. అయితే వారికి ఎలాంటి పరిహారం ఇస్తున్నట్లు ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించలేదు. కాగా, బీహార్ లో పడవ మునకలో మృతుల కుటుంబాలకు మాత్రం ప్రధాని మోడీ రెండు లక్షల రూపాయల పరిహారాన్ని ప్రకటించారు. ఇక ఇప్పుడిప్పుడే ప్రజలు కొంత డీమానిటైజేషన్ ప్రభావం నుంచి ఉపశమనం పోందుతున్న క్రమంలో ప్రజలపై మరిన్నీ అంక్షలకు కేంద్రం సిద్దమైనట్లు సమాచారం.
ఇకపై నగదు లావాదేవీలపై మరిన్ని చెక్పాయింట్లు పెట్టాలని కేంద్రంలోని నరేంద్రమోడీ సర్కార్ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. వచ్చే బడ్జెట్లో నగదు వాడకంపై మరిన్ని ఆంక్షలను ప్రకటించేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్టు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. పాన్ కార్డు అవసరమయ్యే నగదు లావాదేవీల మొత్తాన్ని ప్రభుత్వం మరింత తగ్గించేందుకు ప్లాన్ చేస్తోందని తెలుస్తోంది. ఇన్ని రోజులు రూ.50వేల నగదు కొనుగోళ్లపై ప్యాన్ కార్డును తప్పనిసరి చేసిన ప్రభుత్వం.. ఇక తాజాగా ఈ పరిధిని రూ.30 వేలకు కుదించనున్నట్లు సమాచారం. దీంతో రూ.30 వేలకు సరిపడ ఏమైనా కొనుగోళ్లు చేపడితే వినియోగదారులు తప్పనిసరిగా పాన్ కార్డు చూపించాల్సి ఉంటుంది.
ఇటు పాన్ కార్డు వివరాలు అవసరమయ్యే వ్యాపారి లావాదేవీలను ప్రభుత్వం తగ్గించేస్తుందట. వీటితో పాటు నిర్దేశించిన పరిమితికి మించి నగదు చెల్లింపులు జరిగితే, వాటికీ చార్జీలు వేసేందుకు సిద్ధమవుతుందని తెలుస్తోంది. లక్షకంటే ఎక్కువ నగదు లావాదేవీలు జరిపితే ఈ చార్జీలను వేయనుందని టాక్. ఈ చర్యలతో తక్కువ నగదు వాడకాన్ని ప్రభుత్వం ప్రోత్సహించాలని ప్లాన్ చేస్తోంది. అంతేకాక బ్యాంకులు, ఏటీఎంల వద్ద నగదు విత్డ్రాయల్స్ను ప్రభుత్వం తగ్గించనుంది. నగదు రహిత ఎకానమీకి ఈ చర్యలు ఎంతో సహకరించనున్నాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి..
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more