బీఎస్పీ అధినేత్రి మాయావతిపై అనుచిత వ్యాఖ్యల వ్యవహారం శరాఘతంలా తయారవ్వడంతో దానిని తిప్పికోట్టేందుకు బీజేపి ఎత్తుకు పైఎత్తు వేసింది. దేశంలోనే అత్యంత పెద్ద రాష్ట్రంగా వున్న ఉత్తర్ ప్రదేశ్ లో మరో ఏడాదిలో ఎన్నికలు రానున్న తరుణంలో ఎలాగైన తమ పార్టీకి అపాదించిన మరకను తొలగించుకునే పనిలో భాగంగా చకచకా పావులు కదుపుతోంది. ఇప్పటికే బీజేపి దళిత వ్యతిరేకిగా వ్యవహరిస్తుందని, అటు గుజరాత్ లోనూ దళితులను టార్గెట్ గా చేసిన గో రక్షక సమితీ.. ఇటు ఉత్తర్ ప్రదేశ్ లో ఏకంగా బీఎస్సీ నేతనే టార్గెట్ చేసి వ్యాఖ్యలు చేయిండంతో ఈ భావన ప్రజల్లో బలపడే అవకాశాలున్నాయి,
గుజారాత్ లో దళితులను, కర్రలు ఇనుప రాడ్లతో కోట్టిన ఘటనపై ఇప్పటికే విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో విఫక్షాలు సానుభూతి వ్యక్తం చేయడం, దళితులను తమ వైపు తిప్పుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇదిలా సాగుతుండగానే మాయావతిపై ఉత్తరప్రదేశ్ బీజేపీ మాజీ ఉపాధ్యక్షుడు దయాశంకర్ సింగ్ మరటు వ్యాఖ్యలు చేయడం బీజేపి ప్రతిష్టను పూర్తిగా దెబ్బతీసే అవకాశాలు వుండడంతో.. బీజేపి ఏకంగా రివర్స్ గేర్ అమలు చేస్తున్నట్లు వుంది.
మాయావతి సహా బీఎస్సీ నేతలపై దయాశంకర్ సింగ్ భార్య స్వాతి సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బీఎస్పీ నాయకులు, కార్యకర్తల అనుచిత వ్యాఖ్యలతో తానతో పాటు తన కుమార్తె కూడా మానసికంగా నలిగిపోతున్నామని, ముఖ్యంగా తమ 12 ఏళ్ల కుమార్తె తీవ్ర మనోవేదనకు గురైందని స్వాతి సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. బీఎస్సీ నేతలు తమ కూతురి పట్ల అసభ్యంగా ప్రవర్తించి, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని అరోపిస్తూ అమె పోలీసులకు పిర్యాదు చేశారు, దీంతో అమెపై ఏకంగా పోలీసులు ఎప్ఐఆర్ కూడా నమోదు చేశారు.
అయితే దయాశంకర్ కుటుంబ సభ్యులను తమ పార్టీ మద్దతురాలు వేధించలేదని మాయావతి అన్నారు. తనపై దయాశంకర్ చేసిన వ్యాఖ్యలతో బీఎస్పీ కార్యకర్తలు ఆవేదనకు లోనయ్యారని చెప్పారు. బలహీనవర్గాల ప్రజలను తనను సోదరి, దేవతగా ఆరాధిస్తారని అన్నారు. దయాశంకర్ కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేయొద్దని తమ పార్టీ కార్యకర్తలకు సూచించినట్టు చెప్పారు. తమను అవమానించారని చెబుతున్న దయాశంకర్ కుటుంబ సభ్యులు.. మహిళలకు జరిగిన పరాభవాన్ని ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారని ప్రశ్నించారు. దయాశంశర్ అనుచిత వ్యాఖ్యలు చేసివుండకపోతే.. తమ కార్యకర్తలు వారిపై ఎందుకు అనుచితంగా వ్యవహరిస్తారని బీఎస్సీ నేతలు ప్రశ్నించారు. అధికారంలో వున్నామని తమ నేత పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం.. ఆ తరువాత వాటిని తిప్పికోట్టేందుకు ప్రయత్నాలు చేయడం బీజేపి నేతలకు అలవాటుగా మారుతుందని విమర్శించారు.
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more