22 ఏళ్ల ఓ కుర్రాడు.. దేశంలో అందరికి చెమటలు పట్టిస్తున్నాడు. ఢిల్లీలో ఉన్న మోదీ దగ్గర నుండి గల్లీలోని ఛోటా నాయకుల వరకు అందరూ కూడా హార్దిక్ పటేల్ మీదే మాట్లాడుకుంటున్నారు. అయితే ఓ కుర్రాడు దేశానికి సంబందించి రిజర్వేషన్ అనే కీలకమైన అంశం మీద దేశానికి కొత్త సవాల్ విసురుతున్నారు. గుజరాత్ లోని అగ్రవర్ణాలు పటేల్ లకు రిజర్వేషన్ కల్పించాలనే డిమాండ్ తో గుజరాత్ లో సాగుతున్న అల్లర్లు,నిరసనలు, విద్వంసాల వెనుక బిజెపి,జన సంగ్ ,అర్ఎస్ఎస్ లాంటి సంస్థలు ఉన్నాయా… అంటే అవుననే అనిపిస్తుంది. ఎందుకంటే పటేల్ లు చేసే డిమాండ్ లో వాస్తవికత లేదని, వారు చేసే డిమాండ్ నిజ రూపం దాల్చదని వాళ్లకు కూడా తెలుసినా కావాలనే తమ ఉద్యమాన్ని మరింత ఉదృతం చేస్తున్నారు.
* రెండు నెలల ఉద్యమం చేసి ఇన్ని లక్షల మందిని రోడ్ మీదకు తెచ్చి, బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పని చేస్తున్నాడంటే… ఏంటీ అర్థం.? ఎవరి అండాలేకుండా ఇది సాధ్యమా..?
*గుజరాత్ 15% శాతంగా ఉంటూ, ఆర్థికంగా కూడా ఎంతో బలం ఉన్న పటేల్ లు ఎందుకు ఉద్యమ బాట పట్టాల్సి వచ్చింది అన్న దాని మీద లోతుగా ఆలోచిస్తే మాత్రం కొన్ని విషయాలు అర్థమవుతాయి. అసలు హార్దిక్ పటేల్ ను వెనకుండి నడిపిస్తున్నది ఎవరు అన్నదాని మీద కూడా అందరం ఆలోచించాలి.
* మొదటి నుండి రిజర్వేషన్ లను వ్యతిరేకిస్తూ, వీటి మీద జాతీయ చర్చను కోరుకుంటూ… వీలైతే రిజర్వేషన్ అనే తేనె తుట్టెను కదిపి, అవకాశం ఉంటె రిజర్వేషన్ లనే తీసేసి,కులాలకు అతీతంగా ఆర్థికంగా వెనుకబడ్డ వారికి రిజర్వేషన్ లు ఉండాలని ఎప్పుడు డిమాండ్ చేసే సంగ్ పరివార్ సంస్థల్లో పని చేసే పటేల్ లు రిజర్వేషన్ లు మాకు కావాలని రోడ్ లు ఎక్కడం ఏంటి?
* రిజర్వేషన్ లు 50% మించి ఉండకూడదని సుప్రీం కోర్ట్ చాల స్పష్టంగా తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే ఎస్సి, ఎస్టి, బిసి లకు గుజరాత్ లో కేటాయించిన మొత్తం రిజర్వేషన్ 49.5%, ఇక ఒకవేళ గుజరాత్ ప్రభుత్వం పటేల్ లను ఓబిసి కోటాలో చేర్చుకోవాలి అనుకున్న కూడా… రిజర్వేషన్ లు 50% మించి ఉండకుడదు అని చెప్పే సుప్రీంకోర్ట్ నిభందనలు అడ్డు వస్తాయి. మరి పటేల్ సామాజిక వర్గం వారికి ఈ విషయాలు తెలియవా..? తెలిసినా ఎందుకు ుద్యమం చేస్తున్నారు..?
* రాష్ట్రములో ఇంత పెద్ద విద్వంసం జరిగి, ఏకంగా హోం మంత్రి ఇంటికే ఆందోళనకారులు నిప్పు పెడుతున్న కూడా, రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి అరెస్ట్ లకు పోకుండా, ఈ అల్లర్లను ఉక్కు పాదంతో అణచివేయకుండా ఇంకా చూస్తూ ఉన్నదీ అంటే, ఎలా అర్థం చేసుకోవాలి...?
* సిసి టివి ఫూటేజిలో పోలీస్ లే అల్లర్లను ప్తోత్సహిస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంటే, దీని మీద ప్రజా ప్రయోజన వ్యాజ్యం ధాఖలయ్యి, గుజరాత్ హైకోర్ట్ ప్రభుత్వాన్ని నిలదీసి విచారణకు ఆదేశించే వరకు కూడా ప్రభుత్వం నిమ్మకుండి పోయిందంటే ఎలా అర్థం చేసుకోవాలి.
ఇటువంటి అన్ని సందేహాలకు సమాధానం ఒక్కటే. ఎప్పటి నుండో రిజర్వేషన్ లను వ్యతిరేకిస్తున్న బిజెపి, అర్ఎస్ఎస్ నాయకులు తెర వెనక నుంచి ఈ ఉద్యమాన్ని ప్రోత్సహిస్తున్నట్లుంది. ఎందుకంటే ఎంతో కాలంగా ఆర్ఎస్ఎస్ డిమాండ్ కూడా అేద కాబట్టి దానికి హార్దిక్ పాటిల్ ను వాడుకుంటుందని చాలా మంది విశ్లేషకులు బావిస్తున్నారు. మరి దీని మీద క్లారిటీ రావాలంటే ఇప్పట్లో రాదు.. ఎందుకంటే గుజరాత్ ప్రభుత్వం కానీ, లేదంటే కేంద్ర ప్రభుత్వం కానీ పటేల్లకు అనుకూలంగానో లేదంటే వ్యతిరేకంగానో చర్యలు లేదంటే చట్టాలు తీసుకువస్తే అప్పుడు దీని ప్రభావం కనిపిస్తుంది. అప్పుడు కానీ అసలు ఉద్యమ లక్ష్యం ఏంటో తెలుస్తుంది.
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more