నిన్నటి దాకా భూసేకరణ చేపట్టితీరుతాం అదీ.. ఇదీ అన్న ఏపి మంత్రలు ఒక్కసారిగా రూట్ మార్చారు. చంద్రబాబు నాయుడు ఆదేశాలతో భూసేకరణ రైతులను ఒప్పించి చెయ్యాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే రైతుల నుండి బలవంతంగా భూములు లాక్కోవడం సరికాదని పవన్ కళ్యాణ ట్వీట్ చేయడం పెద్ద సంచలనమే. కాగా ప్రభుత్వం ల్యాండ్ ఆక్విజిషన్ యాక్ట్ తీసుకురాకుండా మరెలా భూమిని సేకరించాలో చెప్పాలని యనమల రామకృష్ణుడు అసహనం వ్యక్తం చేశారు. మరో మంత్రి కూడా పవన్ కళ్యాన్ సలహాలను పాటిస్తాం కానీ అంతా అయిపోయిన తర్వాత మూడు వేల ఎకరాల వద్ద రైతులు పేచీపెట్టడం ఏంటి అని అన్నారు. అయితే గత ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి రావడానికి తీవ్రంగా కృషి చేసిన పవన్ కళ్యాణ్ సత్తా ఏంటో చంద్రబాబు నాయుడుకు తెలుసు. అందుకేగా ప్రధాని నరేంద్రమోదీ కూడా దేశవ్యాప్తంగా ఎంత హవా సాగుతున్నా కానీ తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారానికి రావాలని స్వయంగా పవన్ కు ఫోన్ చేసి పిలిపించుకున్నారు.
భూసేకరణ మీద ముందు నుండి పవన్ కళ్యాణ్ రైతుల తరఫున మాట్లాడుతున్నారు. రైతులకు ఎలాంటి అన్యాయం జరిగినా తాను ఊరుకోనని.. రైతుల తరఫున తాను ప్రశ్నిస్తానని ముందు నుండి అంటున్నారు. అందులో బాగంగానే గతంలో రాజధాని గ్రామాల్లో పర్యటించి ప్రభుత్వం చేస్తున్న భూసేకరణ మీద తన అభిప్రాయాలను రైతులతో, రైతుల అభిప్రాయాలను తాను పంచుకున్నారు. అయితే తాజాగా మరోసారి ప్రభుత్వం భూములు ఇవ్వని రైతుల నుండి ల్యాండ్ యాక్విజిషన్ యాక్ట్ కింద భూములు లాక్కునే ప్రయత్నం చేస్తోంది. అందుకే పవన్ దీనిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. అయితే ఎన్నికల్లో టిడిపి పార్టీని గెలిపించడంలో పవన్ తనవంతు కృషి చేశారు. తన చరిష్మాతో తెలుగు రాష్ట్రాల్లో టిడిపి ఓటు బ్యాంక్ ను బాగా పెంచారు.
తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి సమస్యలున్నా... ప్రజల తరఫున తాను గొంతు విప్పుతానని.. జనాల గొంతునవుతానని పవన్ తన పార్టీని స్థాపించే సమయంలోనే వెల్లడించారు. రాజధాని గ్రామాల్లో ఉన్న రైతులు ముందు నుండి పవన్ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. తాము నమ్మిన ప్రభుత్వమే... తమ ఓట్ల ద్వారా అధికారం చేపట్టిన ప్రభుత్వమే తమకు అన్యాయం చేస్తోందని అందుకే పవన్ కళ్యాణ్ తమకు దిక్కు అని తమ గోడు వినేందుకు రావాలని గతంలో పవన్ ను కోరారు. దానికి స్పందించిన పవన్ రాజధాని గ్రామాల్లో పర్యటించారు. అయితే అనూహ్య స్పందనను చూసిన ప్రభుత్వం, ప్రతిపక్షాలు అవాక్కయ్యాయి. అయితే తాజాగా మరోసారి పవన్ గనుక రంగంలోకి దిగితే మాత్రం తమ పరిస్థితి మరింత చెడుతుందని. ఉన్న కాసింత మంచి పేరు కూడా గంగలో కలుస్తుందని అధికార పార్టీ నేతలు భయపడుతున్నారట. అందుకే వీలైతే రైతులతో పాటు పవన్ కళ్యాణ్ ను కూడా భూసేకరణలో ఒప్పించి ముందుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారట. మరి ఏం జరుగుతుందో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more