ఏపిలో కాంగ్రెస్ పార్టీ మరో వికెట్ డౌన్ అవుతోందా..? అంటే పరిస్థితులు మాత్రం అవుననే అన్నట్లున్కనాయి. కాంగ్రెస్ పార్టీలో ఎంతో కీలకంగా వ్యవహరించిన మాజీ పీసీసీ అధ్యక్షుడు, మాజీ మంత్రి బొత్స సత్య నారాయణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. వైకాపా కీలక నేతలు విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, మిథున్రెడ్డి, జ్యోతుల నెహ్రూ తదితరులు బొత్స ఇంటికి వెళ్లి సంప్రదింపులు జరిపారు. గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో అధికారాన్ని ఆశించి భంగపడిన వైకాపా, ప్రధాన ప్రతిపక్ష హోదాను దక్కించుకుంది. కానీ ఏడాది కాలంగా అధికార పార్టీని సమర్థవంతంగా ఎదుర్కోలేకపోతుందని, ప్రధాన ప్రతిపక్ష పాత్రను పోషించలేకపోతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
కొంతకాలం క్రితం బొత్స వైకాపాలో చేరుతున్నట్లు మీడియాలో కథనాలు వచ్చినా, ఆయన ఆ వార్తలను ఖండించారు. తాను కాంగ్రెస్లోనే కొనసాగుతానని చెప్పుకొచ్చారు. అయితే వైకాపా నేతలు బొత్సతో సంప్రదింపులు జరిపిన నేపథ్యంలో ఇక బొత్స వైకాపా కండువా కప్పుకోవడానికి రంగం సిద్దమైనట్లు తెలుస్తోంది. శనివారం వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్తో బొత్స భేటీ కానున్నట్లు సమాచారం. జూన్ 3,4 తేదీలలో మంగళగిరిలో వైఎస్ జగన్ నిర్వహించనున్నట్లు సమరదీక్షకు బొత్స కూడా హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సమరదీక్షలోనే బొత్స వైకాపా తీర్థం పుచ్చుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
బొత్స సత్యనారాయణను వైకాపాలో చేర్చుకుని, ఆయనకు శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా ఎంపిక చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. శాసనమండలిలో వైకాపాకు ప్రాతినిధ్యం ఉన్నప్పటికీ మండలిలో తమ గళం వినిపించడంలో వైకాపా విఫలమైందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మండలిలో తమ గళం వినిపించేందుకు బలమైన నేత కావాలని భావిస్తున్న వైకాపా, అందుకు బొత్సనే సమర్థుడైన నాయకుడని భావిస్తున్నట్లు తెలుస్తోంది. సుధీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న బొత్స మండలిలో అధికార పార్టీని సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతారని వైకాపా అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more