కాంగ్రెస్ అధినేత్రి నాయకత్వానికి ఎవరైనా ప్రశంసలు గుప్పించాల్సిందే. అసలు పార్టీలో ఎలాంటి సమన్యయం లేనపుడు ఎంతో కీలకంగా వ్యవహరించి పరిస్థితిని చక్కదిద్దింది సోనియాగాంధీ. స్వాతంత్ర కాలం నాటి పార్టీని తిరిగి అధికారానికి చేరువ చెయ్యడంలో ఎంతో కృషి దాగి ఉంది. అయితే సోనియా గాంధీ వల్లే కాంగ్రెస్ పార్టీ కొత్త పుంతలు తొక్కింది అనేది అందరూ ఒప్పుకేనే విషయం. ఎందుకంటే పార్టీకి వైభవాన్ని కట్టబెట్టిన ఘనత సోనియా దే. అయితే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమా.. లేక కన్న కొడుకు రాహుల్ గాంధీ ముఖ్యమా అంటే సోనియా గాంధీ అయినా తల్లే కాబట్టి కొడుకే ముఖ్యమని అంటుంది. కాంగ్రెస్ పార్టీలో తనకు ప్రాధాన్యత లబించడం లేదని, తన మాటకు విలువ లేకుండా పోయిందని రాహుల్ గాంధీ గత కొంత కాలంగా కనిపించకుండా పోయారని ఓ పుకారు. అయితే కాంగ్రెస్ నాయకత్వంపై రాహుల్ కాస్త అలక పూనారని అందరికి తెలుసు. అయితే తాజాగా సోనియా గాంధీ మరోసారి పార్టీ అధినేతగా కొనసాగుతారని వార్తలు వెలువడ్డాయి.
సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఘోర పారాజయానికి తీవ్రంగా కుంగి రాహుల్ గాంధీ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు. అయితే పార్టీలో రాహుల్ కు, అతని క్యాడర్ కు తగిన గుర్తింపు, విలువ లబించడం లేదని కాంగ్రెస్ పార్టీ నాయకులే చర్చించుకుంటున్నారు. అయితే పార్టీలో గత కొంత కాలంగా తమ సేవలను అందించిన సీనియర్లను రాహుల్ కాస్త దూరంగా ఉంచారు. దాంతో పార్టీలో సీనియర్ల పని అయిపోయిందని ప్రచారం సాగింది. అయితే పార్టీలో సీనియర్ల విషయం ఏమో కానీ రాహుల్ ప్రభావం మాత్రం పెద్దగా పని చెయ్యలేదు. దాంతో రాహుల్ కు ఏఐసిసి బాధ్యతలు అప్పగిస్తే కానీ పార్టీ గాడిన పడదని కొందరు రాహుల్ భజన బృందం వాదిస్తోంది. కానీ రాహుల్ ఇంకా పరిణతి చెందలేదని కనుక అనుభవం ఉన్న సోనియాగాంధీనే బాధ్యతల్లో కొనసాగాలని కొందరు వాదిస్తున్నారు. అయితే మరి సోనియా గాంధీ మరో సారి పార్టీ ని అధికారంలోకి తీసుకు వచ్చేందుకు నడుం కడుతుందా అని అందరు చర్చించుకుంటున్నారు. కాగా రాహుల్ గాంధీ కోసం ఏఐసిసి పదవికి దూరంగా ఉంటారా అన్నది ఇప్పుడు కాంగ్రెస్ నాయకుల మదిలో ప్రశ్న. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి.
- అభినవచారి
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more