భారత ప్రముఖ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా... నిన్నమొన్నటివరకు ఈ అమ్మడి పేరు అంతగా వినిపించేది కాదు. కేవలం గేమ్స్ లో పార్టిసిపేట్ చేయడం... అందులో ఓడిపోవడం... తన పాకిస్తానీ భర్తతో కలిసి తిరగడం లాంటిని సమాచారాలు తప్పితే... ఈమెకు సంబంధించిన ప్రత్యేక వార్తాకథనాలు అయితే వచ్చేవి కావు. అయితే ఎప్పటినుంచైతే ఈ అమ్మడు తెలంగాణా బ్రాండ్ అంబాసిడర్ గా నియమించబడిందో... అప్పటినుంచి టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయింది. అంతవరకు లేని స్థానికత గొడవలు.. ఒక్కసారిగా తెరమీదకు వచ్చేశాయి. ఇటు ఆంధ్రా రాజకీయాల నుంచి ఈమె మీద ఎన్నో విమర్శలు... నేషనల్ మీడియాలో అందుకు సంబంధించిన తెగ వార్తాకథనాలు! మొత్తంగా చెప్పాలంటే.. ఈమె తెలంగాణా బ్రాండ్ అంబాసిడర్ గా ఎన్నుకోబడిన క్షణం నుంచి కేవలం తెలంగాణా రాష్ట్రానికే కాదు.. ఇండియాకే పెద్ద బ్రాండ్ గా మారిపోయింది. ఈమెకు ఈ స్థానం దక్కడానికి కారణం కేవలం తెలంగాణాకే సాధ్యమని చెప్పడంలో ఔచిత్యమేమీ లేదు.
సానియా బ్రాండ్ అంబాసిడర్ గా ఎన్నికైన నేపథ్యంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఆమెకు కోటి రూపాయల నజరానా ప్రకటించిన విషయం తెలిసిందే! అలాగే ఇటీవలే యూఎస్ ఓపెన్ డబుల్స్ సాధించడంతో మరోసారి ఆమెకు కోటిరూపాయల వరం కూడా లభించింది. ఇదిలావుండగా... ప్రస్తుత సానియామీర్జా వ్యవహారం శైలి చూస్తుంటే ఆమెకు తెలంగాణా అంటే అంతగా ఇష్టం లేనట్టుగా కనిపిస్తోంది. సానియాకు కోట్లకు కోట్ల రూపాయలు తెలంగాణా అంటగడుతున్నప్పటికీ... ఆమెకు తెలంగాణా మీద మక్కువ లేనట్టుగా తెలుస్తోంది. అందుకు కొన్ని నిఖార్సైన కారణాలు కూడా మన కంటికి కనిపిస్తాయి. అదేమిటంటే.. తెలంగాణా బ్రాండ్ అంబాసిడర్ వ్యవహరిస్తున్న ఈ అమ్మడు.. తెలంగాణా లోగోను ఇంతవరకు ధరించలేదు. సాధారణంగా ఏదైనా ఒక ప్రొడక్ట్ గా అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న తారలు.. ఆ ప్రొడక్ట్ కు సంబంధించిన లోగోలతో ప్రచారం చేస్తారు. కానీ సానియా మీర్జా అలా చేయడం లేదు. దీంతో తెలంగాణా ప్రజలు ఆమె మీద ఆగ్రహంగా వున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా.. ఈ విషయంమీద రకరకాల అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.
సానియా మీర్జా యూఎస్ ఓపెన్ లో ఆడుతున్న సమయంలో తెలంగాణా లోగోను ధరించివుంటే.. తెలంగాణా బ్రాండ్ విశ్వవ్యాప్తంగా విస్తరించి వుండేది కదా అంటూ వ్యాఖ్యానిస్తున్నారు విశ్లేషకులు. తెలంగాణా సర్కారు ఔదార్యాన్ని కోట్ల రూపాయల్లో స్వీకరించిన ఈ క్రీడాకారిణి... లోగో ఎందుకు ధరించడం లేదంటూ ప్రశ్నలను లేవనెత్తుతున్నారు. ఈ నిబంధన తెలంగాణా సర్కార్ పెట్టలేదా..? లేకపోతే సౌత్ కేటగిరిలో వున్న తెలంగాణా అంటే ఇష్టం లేక సానియానే నిరాకరించిందా..? అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా ఒక బ్రాండ్ కి అంబాసిడర్ గా నియమితులైన తర్వాత దాని ప్రచారం చేయాల్సిన బాధ్యత వారికే వుంటుంది. ఇక్కడ తెలంగాణా విషయంలో సానియా మీర్జా అలా వ్యవహరించకుండా ముఖం చాటేయడం మీద అధికారులు మండిపడుతున్నారు. అంతర్జాతీయ తెలుగు క్రీడాకారులున్నప్పటికీ.. ప్రత్యేకంగా టీఆర్ఎస్ ప్రభుత్వం సానియా మీర్జాకు బ్రాండ్ కిరీటం తొడిగిస్తే... దానికి కనీసం కృతజ్ఞత భావాన్ని కూడా ఈ పాకిస్తానీ కోడలు చూపించడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ విషయంపై క్రీడా సంఘ బాధ్యుడు మాట్లాడుతూ... రెండు తెలుగు రాష్ట్రాల్లో సమగ్ర క్రీడా పాలసీలు వస్తేనే ఇలాంటి పొరబాట్లను సవరించే వీలుంటుందని సూచించారు. యూఎస్ ఓపెన్ లో సానియా మీర్జా తెలంగాణా లోగో ధరించకుండా ఆడడాన్ని ఆయన తప్పుపట్టారు. ప్రభుత్వం నుంచి డబ్బులు దండుకుంటున్నప్పుడు.. సానియా ఎందుకు లోగో ధరించలేదని ప్రశ్నల వర్షాన్ని కురిపిస్తున్నారు. ఈ వ్యవహారంపై సీఎం కేసీఆర్ దృష్టి సారించే తక్షణమే తగిన చర్యలు చేపట్టి సానియాకు లోగోను ప్రవేశపెడితే... అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ బ్రాండ్ విస్తరిస్తుందనే అభిప్రాయాన్ని వెలువరిస్తున్నారు. మరి ఈ విషయంపై కేసీఆర్, సానియా మీర్జాలు ఎలా స్పందించనున్నారో వేచి చూడాల్సిందే!
AS
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more