రాష్ట్రం విడిపోయినా.. ఆగడాలు ఆగటం లేదని టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎస్ . రామలింగారెడ్డి అంటున్నారు. రాష్ట్రం విడిపోయిన మాట వాస్తవం. కానీ ఆగడాలు అనే మాట ఎవరికి కొత్త కాదు! కానీ ఆగడాలు చేస్తుంది ఎవరు? అంటే.. వెంటనే టీఆర్ఎస్ నాయకులు .. సీమాంద్ర నాయకులని .. ఆరంగుళాల నాలుగు బయట పెట్టి .. మీడియా ముందు గొప్ప చెబుతున్నారు.
కానీ ఇప్పుడు హైదారాబాద్ లో.. సీమాంద్ర నాయకులు ఉన్నారా? హైదరాబాద్ నగరంలో.. కేవలం సీమాంధ్ర వారే ఉంటున్నారా? వారి వల్ల 60 సంవత్సరాల్లో జరగని ఆగడాలు., టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత ఎందుకు జరుగుతున్నాయి? మీరు చెప్పినట్లే రాష్ట్రం విడిపోయినా సీమాంధ్రల ఆగడాలు ఆగలేదని చెబతున్నారు? నిజంగా ఇది జరుగుతుందా అని ..హైదరాబాద్ నగరంలో నివసించే ప్రజలు అడుగుతున్నారు.
ఎమ్మెల్యే రామలింగారెడ్డి మాట్లాడుతూ.. సీమాంద్ర నేతలు తక్షణమే ఆంధ్రప్రదేశ్ రాజధానికి వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి రాజధానిగా పది సంవత్సరాల పాటు.. ఇరు ప్రాంతాల నాయకులు , ప్రజలు కలిసి మెలిసి ఉండాలి. కానీ రెండు రాష్ట్రాలు ఏర్పాటు జరిగి .. 100 రోజులు పూర్తికాక ముందే.. టీఆర్ఎస్ వైఖరి ఏమిటో.. చాలా గొప్ప గా బయట పెట్టారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే రామలింగారెడ్డి .
ఇప్పటి వరక ఇరు ప్రాంతాల ప్రజల మద్య ఎలాంటి విబేధాలు లేవు, కేవలం రాజకీయంగా కొట్టుకుంటుంది ఇరు ప్రాంతాల నాయకులే. మీడియాలో కనిపించాలనే కోరికతో.. కొవ్వెక్కిన కామెంట్లు చేస్తూ.. సామాన్య ప్రజలను అయోమయంలోకి నేడుతున్నారు. ప్రజల అభివృద్ది కోరుకున్న ఏ రాజకీయ నాయకులు మౌనంగా తన పని తాను చూసుకుంటూ.. ప్రజలకు మేలు చేస్తారు. కానీ పబ్లిసిటీ కోసం పని చేసే రాజకీయ నేతలు.. మీడియా ముందు ఇష్టవచ్చినట్లు మాట్లాడి.. ప్రజల్లో ఉన్న పరువు ను కాస్త తీసుకుంటారని.. నగరంలో నివసిస్తున్న ప్రజలు, చదువుకున్న యువకులు అంటున్నారు.
స్థానికత బలం ఉన్న మీరు ఆగడాలు సృష్టిస్తారా? లేక అద్దె రాజధాని పాలన సాగిస్తున్న ఆంద్ర నేతలు ఆగడాలు సృష్టిస్తున్నారా? అనేది ప్రజలకు గమనిస్తున్నారు. పెద్దవారిని వదిలిపెట్టి, పెదవారు కట్టుకున్న ఇళ్ల పై మీ బలం చూపించి, తెలంగాణ ప్రజలను నడిరోడ్డుపై నిలబెట్టినప్పుడు .. ఈ పార్టీ యెక్క రంగు పూర్తిగా వెలిసిపోయింది. ఆంద్రనేతలు నిజంగా ఆగడాలు చేస్తే. ..గడిచిన 60 సంవత్సరాలల్లో.. ఏం జరిగి ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండని నగరంలో ఉన్న సీమాంద్ర ప్రజలు అంటున్నారు.
1956 అంటూ .. విద్యార్థుల జీవితాలతో డబుల్ గేమ్ ఆడుతూ.. రాజకీయ పబ్బం గడుపుతున్న మీరు.. ఆగడాలు ఎవరు సృష్టిస్తున్నారో.. ఖచ్చితంగా తెలుసుకోని మీడియా ముందు మాట్లాడితే.. అందరికి బాగుంటుందని తెలంగాణ కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ‘‘ ఆంధ్ర విడిపోయిన.. ఆంద్రా అనే పదం తెలంగాణ నేతలు విడవలేకపోతున్నారు. అందుకు ఇలాంటి విమర్శలు చేస్తూ.. ఆంధ్ర పై ఉన్న ప్రేమను బయటకుచెబుతున్నారు.’’
RS
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more