అమ్మ చాటు పిల్లలకు.. ఎన్నో కష్టాలో? ఎవరికి కోపం వచ్చిన కనిపించేది చిన్నపిల్లలే..? చివరు పుట్టించిన ఆ బ్రహ్మ దేవుడికి కోపం వచ్చిన చిన్నపిల్లలమీదే పగతీర్చుకుంటాడు. అమ్మ.. అమ్మ అని పిలిచే పలుకులు.. చాటు ఎన్ని బాధలో..!!ఇంగ్లీష్ చదువులు చుదువుకోవాలని.. ఇంటి నుండి ప్రైవేట్ బడికి బస్సులు పంపితే..? ఇంటికే దూరం అయిన బడిపిల్లలు. అమ్మ టాటా.. !! అంటూ చిట్టి పలుకు పలికిన తెలంగాణ ముద్దు బిడ్డలు మట్టిలో కలిసిపోయారు. పిల్లలు జీవితాలు బాగుపడాలని.. కయా కష్టం చేసి, బడికి పంపిస్తే.!! మా బతుకుల్లో చీకటి నింపిపోయారు.
భవిష్యత్ చూడాల్సిన బిడ్డలను మృత్యువు కబళిస్తే ఎంత బాధ, ఎంతటి గుండె కోత. అసలు స్కూల్ బస్సులకు సేఫ్టీ కరువయిందా? అవే మృత్యుశకటాలుగా మారుతున్నాయా? స్కూల్ బస్సులకు ఎలాంటి స్టాండర్డ్స్ ఉండాలి? డ్రైవింగ్ రాకుండానే స్టీరింగ్ పట్టేస్తున్నారా? రైల్వే క్రాసింగ్ లు డేంజర్ స్పాట్ లుగా మారుతున్నాయా? మెదక్ జిల్లా బస్సు ఘటన అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది...
‘‘ అందరికి ఒక్కటే ప్రశ్న ..అమ్మ మమ్మల్ని చంపిందెవరు’’ అని ఆ బడిపిల్లల ముఖాల్లో కనిపిస్తున్న ప్రశ్న!! ఈ ప్రశ్న కు ఎవరు సమాధానం చెప్పాలి. ఎవర్ని బాధ్యుల్ని చేయాలి? ఎవరు ఎన్ని హమీలు ఇచ్చిన.. ‘‘మమ్మల్ని చంపిందెవరో పట్టుకోలేరు.. వారికి శిక్ష వేయటం అనేది పగటి కలే!!!
కేంద్ర ప్రభుత్వ అలసత్వం, రైల్వే శాఖ నిర్లక్ష్యం వెరసి 20 మంది పసి ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి. అన్నెం పున్నెం ఎరుగని పసికూనలకు అప్పుడే నూరేళ్లు నిండాయి. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేట రైల్వే గేట్ వద్ద జరిగిన ఘోర రైలుప్రమాదం ప్రతి ఒక్కరి హృదయాన్ని కలచి వేస్తోంది. చూసే వాళ్లే కన్నీళ్లు పెట్టుకుంటుంటే, ఇక తల్లిదండ్రుల శోకాన్ని ఆపగలిగేదెవరు? వారి పరిస్థితి తలుచుకుంటేనే గుండె తరుక్కుపోయేలా ఉంది. తన ఇద్దరు బిడ్డలు వహీద్, రజియా ఇక లేరని తెలుసుకున్న ఆ కన్నతండ్రి గుండె ఆగిపోయింది. మరెందరో జరిగిన నిజాన్ని జీర్ణించుకోలేక కన్నీటి సంద్రంలో మునిగిపోతున్నారు.
తూప్రాన్ కు చెందిన కాకతీయ టెక్నో పాఠశాలకు చెందిన ఏపీ 23 ఎక్స్5349 బస్సు రైల్వేగేటు దాటుతుండగా నాందేడ్ నుంచి హైదరాబాద్ వస్తున్న పాసింజర్ రైలు స్కూలు బస్సును ఢీకొంది. ఈ ఘోరప్రమాదంలో అంతులేని విషాదాన్ని మిగిల్చింది. గాయపడ్డ విద్యార్థులను మెరుగైన చికిత్స కోసం పలు ఆస్పత్రులకు తరలించారు. విద్యార్థులంతా ఇస్లాంపూర్, వెంకటాయపల్లి, గూనేపల్లి గ్రామాలకు చెందిన వారు. కిలోమీటర్ వరకు బస్సును రైలు ఈడ్చుకెళ్లటంతో ప్రమాద తీవ్రత పెరిగిందని ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. రైలుకు సడన్ బ్రేకు వేస్తే..వెనక ఉన్న 14బోగీలు పట్టాలు తప్పి, మరింత ఘోరమైన ప్రమాదం సంభవిస్తుంది. అందుకే నెమ్మదిగా బ్రేకులు వేస్తూ దాదాపు అర కిలోమీటరు దూరం తర్వాతే రైలును ఆపగలిగాడని రైల్వే వర్గాలు అంటున్నాయి.
మాసాయిపేట్ ప్రమాదానికి ప్రధానం కారణం రైల్వేగేటు లేకపోవటమే. ఇక్కడ ఇప్పటికే చాలా ఘటనలు జరిగాయి. ఇటీవలే ఓ లారీ రైలుకు ఢీకొని డ్రైవర్ చనిపోయాడని స్థానికులు గుర్తు చేశారు. మనుషులతో పాటు ఎన్నో మూగజీవాలను రైళ్లు మింగేశాయి. ఈ ఏరియాలో లెవల్ క్రాసింగ్ ఏర్పాటు చేయాలని స్థానికులు ఎన్నో సార్లు దక్షిణమధ్య రైల్వే కి విజ్ఞప్తి చేశారు. వినతి పత్రాలు సమర్పించారు. అయినా ఫలితం లేకుండా పోయింది. రైల్వే క్రాసింగ్ ఏర్పాటు చేయాలన్న స్థానికుల డిమాండ్ ను అధికారులు తేలిగ్గా తీసుకున్నారు. ఫలితంగా ఇంతటి దారుణాన్ని చూడాల్సి వచ్చిందని మండిపడుతున్నారు స్థానికులు.
రైలు గేటు వేసి ఉన్నా లేక పోయినా, పట్టాలపై ఎక్కుతున్నామంటే అటూ ఇటూ చూసి వెళ్లటం మినిమమ్ కామన్ సెన్స్.కానీ డ్రైవర్ ఏ మాత్రం సోయి లేకుండా పట్టాలపై సడన్ గా వెళ్లనట్టు అర్ధమవుతుంది. అదే ఈ ప్రమాదానికి పెద్ద కారణమనే అభిప్రాయం అందరిలో కనిపిస్తోంది. అంతేకాదు, ఇందులో స్కూలు పాత్ర కూడా ఉంది. రెగ్యులర్ డ్రైవర్ అందుబాటులో లేకపోవటంతో ఓ ట్రాక్టర్ డ్రైవర్ కి స్టీరింగ్ అప్పజెప్పినట్టు సమాచారం. అతగాడి నిర్లక్ష్యమే ఈ దుర్ఘటనకు కారణమనే విమర్శలు వినిపిస్తున్నాయి.
స్కూల్ ఫీజులను చుక్కల్లో చూపిస్తాయి. హైక్లాస్ ఎడ్యుకేషన్ అంటాయి..ట్రాన్స్ పోర్ట్ ఫెసిలిటీ ఉందంటాయి. దానికోసం అదనంగా వేలకు వేలు బాదేస్తాయి. ఇదంతా కార్పొరేట్ స్కూల్స్ మహిమ. ప్రతీ స్కూల్ కు ఇప్పుడు రవాణా అన్నది కీలకంగా మారింది. విద్యార్థులను ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చి తిరిగి క్షేమంగా దింపాల్సిన బస్సుల విషయంలో స్కూల్ మేనేజ్మెంట్లన్నీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. ప్రీప్రైమరీ నుండే తల్లిదండ్రులు జేబులు గుల్ల చేసే స్కూళ్లు, పిల్లల భద్రతను మాత్రం పట్టించుకోవటం లేదు. వేలకు వేలు పిండటంలో ఉన్న శ్రద్ధ స్కూల్ బస్సుల మెయింటెనెన్స్ పై పెట్టడం లేదు. ఆ మధ్య జరిగిన తనిఖీల్లో పెద్ద పెద్ద స్కూళ్ల బస్సుల్లోనే అనేక లోపాలు కనిపించాయి. సరైన ఫిట్ నెస్ లేక దాదాపు 50 బస్సుల్ని సీజ్ చేశారు.
స్కూళ్లకు పిల్లలను పంపడంతోనే తల్లిదండ్రుల బాధ్యత తీరిపోవటం లేదు. వారి భద్రత కూడా ఒక సవాల్ గా మారింది. పిల్లలు ఉదయం బడికి వెళ్లి సాయంత్రం ఇంటికి క్షేమంగా వచ్చేవరకు పేరెంట్స్ కి టెన్షన్ ఉంటోంది. తరచూ ప్రమాదాలు జరుగుతుండటమే ఇందుకు కారణం.
మొత్తానికి మాసాయిపేట్ ప్రమాదం నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉన్నాయి. చిన్నారుల క్షేమం కోసం అందరూ కదలాల్సి ఉంది. తప్పు ఎవరిదైతే ఏంటి? న్యాయవిచారణలు ఎన్నిచేస్తే ఏంటి? ఎక్స్ గ్రేషియాలు ఎంతిస్తే ఏంటి? ఆ పిల్లలు కళ్లు తెరుస్తారా? వారి ప్రాణాలు తిరిగొస్తాయా? చెయ్యాల్సిందల్లా బాధ్యతను సక్రమంగా నిర్వర్తించటమే.
జూన్ 28, 2014న గుంటూరు జిల్లా రొంపిచర్ల రహదారిపై స్కూల్ బస్సు అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకువెళ్లింది. బ్రేకులు ఫైయిల్ కావటంతో ఈ ఘటన చోటు చేసుకుంది.
జూన్ 10, 2014న తూర్పుగోదావరి జిల్లా కాజులూరు మండలం చేదువాద వద్ద స్కూలు బస్సు చెట్టును ఢీకొనటంతో 10 మంది విద్యార్థులు గాయపడ్డారు. డ్రైవర్ నిర్లక్ష్యమే దీనికి కారణం.
ఏప్రిల్ 3, 2014న అనంతపురం జిల్లా కొడికొండ చెక్ పోస్ట్ వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మృతి చెందగా 20 మంది విద్యార్థులు గాయపడ్డారు.
మార్చి 20, 2012న ఖమ్మం జిల్లా కొత్తగూడెంవోని ఎల్ వి రెడ్డి స్కూలుకు చెందిన బస్సు ఎదురుగా వస్తున్న బైక్ ను తప్పించబోయి కాల్వలో బోల్తా పడింది. ఈ ఘటనలో 14 మంది పిల్లలు మృతి చెందారు. ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని తేలింది.
ఇలా మన చిన్నారులు.. చిరుప్రాయంలోనే.. చీకటి కలిసిపోవాల్సిందేనా? తల్లిదండ్రులకు .. ఈ గుండెకోత తప్పదా? ఇకనైన ప్రభుత్వ అధికారులు, రాజకీయ నేతలు .. స్పందించి తగు చర్యలు తీసుకోవాలని .. బడిపిల్లలు కోరుతున్నారు. !!
RS
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more