తెలంగాణలో టీడీపీ సీనియర్ నాయకుడు, తెదేపా తరుపునుండి సనత్ నగర్ ఎమ్మెల్యేగా గెలుపొందిన తలసాని శ్రీనివాస్ యాదవ్ త్వరలో టీడీపీని వీడి, కారెక్కబోతున్నారా ? ఈయన గులాబీ పార్టీ జల్లే సువాసనైన ఆకర్షణ మంత్రాలకు ముగ్దుడు అయ్యాడా ? అంటే తాజాగా రాజకీయ వర్గాల నుండి అవుననే సమాధానం వినిపిస్తుంది. సాధారణ ఎన్నికల ముందు టీడీపీని వీడి వైయస్సార్ పార్టీలో చేరుతారనే ప్రచారం సాగిన విషయం తెలిసిందే.
కానీ టీడీపీ తరుపున పోటీ చేసి గెలిచినా తెలంగాణలో తెదేపా అధికారంలో లేకపోవడంతో పదవి ఉండి ఏమి అనుభవించలేకపోతున్న ఆయన అధికార పార్టీ టీఆర్ఎస్ లో చేరిత బాగుందనే ఆలోచనకు వచ్చినట్లు చెబుతున్నారు. టీడీపీ టిక్కెట్ పై గెలిచినా గత కొన్నాళ్ళ నుండి తలసాని టీడీపీకి అంటీ ముట్టనట్లుగా వ్యవహరిస్తూ వస్తున్నాడు.
దానికి కారణం ఈయన మొన్నటి మొన్న తెలంగాణ ఫ్లోర్ లీడర్ పదవి ఆశించి భగపడటం, చంద్రబాబు వ్యవహారశైలి ఏపీకి అనుకూలంగా, తెలంగాణకు వ్యతిరేకంగా ఉండటంతో తనకు రాజకీయ భవిష్యత్తు ఉండదని, రాను రాను తెలంగాణలో టీడీపీ పార్టీ పరిస్థితి మరింత అద్వానంగా మారుతుందనే నేపథ్యంలో ఆయన టీఆర్ఎస్ పార్టీ నేతలతో , ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తో టచ్ ఉంటూ ఆయనతో చేరిక విషయం పై చర్చలు జరుపుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఆటు టీఆర్ఎస్ నేతలు కూడా తలసానిని పార్టీలో చేర్చుకుంటే సనత్ నగర్ పై కూడా పట్టు సాధించవచ్చని, టీఆర్ఎస్ పార్టీ నేతలు వేసే ఆకర్షణ మంత్రాలు కూడా బాగుండటంతో తలసాని తెదేపాను వీడి, కారెక్కడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. తలసానితో పాటు మరో నలుగురు తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలు కూడా గులాబీ కండువా కప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నారట. ఒకవేళ తలసాని టీఆర్ఎస్ లో చేరితే వచ్చే మంత్రి వర్గ విస్తరణలో ఈయనకు మంత్రి పదవి ఇచ్చే సూచనలు కూడా ఉన్నాయంటున్నారు.
అదే జరిగితే టీడీపీకి తెలంగాణలో పెద్ద దెబ్బే అని చెప్పవచ్చు. గతంలో మోత్కుపల్లి కూడా అధినేత పై అసంతృప్తి సెగలు గక్కిన సమయంలో చాలా చాకచక్యంగా వ్యవహరించిన ఈ అపర రాజకీయ చాణక్యుడు టీడీపీ అధినేత చంద్రబాబు ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారో వేచి చూడాలి.
Knr
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more