నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి నిమిత్తం ప్రచార రంగంలోకి దిగిన అగ్రనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, బుధవారం రోడ్ షోను నిర్వహిస్తున్నారు. వైకాపాను, ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డిని దుయ్యబడుతు ముందుకు సాగుతున్నాడు. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడానికి ఆ పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆరోపించిన బాలయ్య, వారు చెప్పేది హంస మాటలని, చేసేది కోతి చేష్టలని అన్నారు. ఓటర్లు జాగ్రత్తగా ఉండాలని, వారి ఉచ్చులో పడవద్దని కోరారు.
నంద్యాల నేత భూమా నాగిరెడ్డి బిడ్డలు కష్టాల్లో ఉన్నారని, వారికి ప్రజలంతా అండగా ఉండాలని కోరారు. ఈ ఎన్నికల్లో భూమా వారసుడైన బ్రహ్మానందరెడ్డికి ఓట్లు వేసి గెలిపించాలని, విపక్షాలను ఓటు తూటాతో కుప్పకూల్చాలని బాలయ్య పిలుపునిచ్చారు. ఆయన పర్యటన వెంకటేశ్వరపురంలో ప్రారంభమై, ప్రస్తుతం పల్లెల్లో సాగుతోంది. ప్రజా సంక్షేమం కోసం ఎంతగానో పాటుబడుతున్న టీడీపీని అఖండ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. అన్ని వర్గాలవారికి టీడీపీ న్యాయం చేస్తోందని చెప్పారు. అన్ని విధాలా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నామని... అభివృద్ధిని అడ్డుకుంటున్నవారికి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. నీతికి-అవినీతికి, న్యాయానికి-అన్యాయానికి మధ్య జరుగుతున్న పోరాటమే నంద్యాల ఉపఎన్నిక అని చెప్పారు. ఓటు తూటాతో వైసీపీకి బుద్ధి చెప్పాలని కోరారు.
కేవలం స్వార్థం కోసమే శిల్పా మోహన్ రెడ్డి, శిల్పా చక్రపాణిరెడ్డిలు వైసీపీలో చేరారని విమర్శించారు. సాక్షి పేపర్, టీవీ ఎవరిదో జగన్ చెప్పాల్సిన అవసరం ఉందని బాలయ్య ప్రశ్నించారు. తాను కేవలం నటుడిని మాత్రమే కాదని... ప్రజా సేవకుడిని కూడా అని చెప్పారు. రోడ్ షో సందర్బంగా బాలయ్యకు అభిమానులు ఘన స్వాగతం పలికారు.భూమా కుమార్తె అఖిలప్రియ మంత్రి కావడం సంతోషంగా ఉందని చెప్పారు. ఈ సందర్భంగా 'ఒక్క మగాడు' సినిమాలో కులాలపై ఉన్న డైలాగును బాలయ్య చెప్పగా, అభిమానులు ఈలలు వేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. నంద్యాల టౌన్, గోస్పాడు, నంద్యాల రూరల్ ప్రాంతాల్లో బాలయ్య ప్రచారం కొనసాగనుంది.
టూర్ లో అపశృతి...
ప్రముఖ సినీ నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ నంద్యాల ఉప ఎన్నిక నేపథ్యంలో ఈ రోజు ప్రచారాన్ని ప్రారంభించారు. రోడ్ షో ద్వారా ఆయన ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. అయితే, ఆయన రోడ్ షో ప్రారంభించిన కాసేపటికే చిన్న అపశ్రుతి దొర్లింది. బాలయ్య కాన్వాయ్ లోని ఓ వాహనం ఓ బాలుడిని ఢీకొంది. వెంటనే ఆ బాలుడిని ఆసుపత్రికి తరలించారు. బాధితుడు స్వల్పంగా గాయపడ్డాడని, చికిత్స అందిస్తున్నామని వైద్యులు తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more
Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more
Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more
Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more
Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more