శ్రీకాకుళంలో ఎక్కడో మారుమూల ఉన్న ఉద్ధానం ప్రజల సమస్యను వెలుగులోకి తేవటం ద్వారా ఒక్కసారిగా జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ వార్తల్లో హైలెట్ అయ్యాడు. ప్రభుత్వాలు కూడా పట్టించుకోని ఓ తీవ్ర సమస్యను పరిష్కారం దిశగా తీసుకెళ్తున్నాడంటూ అభినందనలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో విపక్షాలన్నీ పవర్ స్టార్ ను ప్రశంసించాల్సిన పరిస్థితి నెలకొంది.
మరోవైపు వైసీపీ కూడా ఈ విషయంలో సానుకూలత వ్యక్తం చేసింది. పవన్ గనుక ఈ విషయంలో గనుక మద్ధతు కోరితే తమ అదినేత జగన్మోహన్ రెడ్డి ఖచ్ఛితంగా స్పందిస్తాడని పార్టీ ఫైర్ బ్రాండ్ రోజా తెలిపింది. అది ముమ్మాటికీ తీవ్ర మైన సమస్య.. ఈ విషయంలో నిర్దిష్టమైన ప్రతిపాదనతో జనసేన పోరాటానికి తమ పూర్తి సహకారం ఉంటుందని చెప్పింది. అయితే పవన్ స్పీచ్ లో ఓ వ్యాఖ్యపై మాత్రం నగరి ఎమ్మెల్యే తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది.
గత ప్రభుత్వాల నిర్లక్ష్యం అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేసింది. 2004 లో అధికారంలోకి రాగానే స్వర్గీయ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వైజాగ్ కింగ్ జార్జ్ హస్పిటల్ కు చెందిన వైద్యుల బృందాన్ని ఉద్ధానం సమస్య పరిష్కారం కోసం పర్యటించాల్సిందిగా ఆదేశించిన విషయాన్ని గుర్తు చేసింది. అంతేకాదు.. అదే కేజీహెచ్ ఆస్పత్రికి చెందిన ఓ స్పెషలిస్ట్ వైద్యుడిని 2007 లో శాన్ ఫ్రాన్సిస్ కో లో జరిగిన అంతర్జాతీయ సదస్సు కు పంపించి అక్కడ కూలంకశంగా చర్చించేందుకు పంపించిన విషయాన్ని కూడా ప్రస్తావించింది.
ఉద్ధానం సమస్య తానొక్కడే పరిష్కరించినట్లు పవన్ ఫీలవుతున్నాడని, తెలుగు దేశం ఏదో పై పై మెరుగుల చర్యలు చేయించి ఆ ఘనతకు ప్రభుత్వంకు కట్టబెట్టి, తాను లాభపడాలని చూస్తున్నాడంటూ ఆరోపణలు గుప్పించింది. రాష్ట్రంలో ఎక్కువ అధికారంలో ఉన్న చంద్రబాబుకు నలభై ఏళ్ల ఈ సమస్య కంటబడకపోవటం దారుణమని, ప్రజా పోరాటం లో ఎవరితోనైనా చేయి కలిపేందుకు తాము సిద్ధమని తెలిపింది.
(And get your daily news straight to your inbox)
Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more
Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more
Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more
Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more
Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more