తెలంగాణ సీఎం కేసీఆర్ తో నటి, సికింద్రాబాదు మాజీ ఎమ్మెల్యే సన్నిహితంగా వున్న నేపథ్యంలో ఆమె టీఆర్ఎస్ పార్టీలోకి జంప్ అవుతున్నట్లుగా ప్రచారాలు మొదలయ్యాయి. త్వరలోనే ఈమె జయసుధ కాంగ్రెస్ కి చేయిచ్చి గులాబీ కప్పుకుంటారని పుకార్లు షికార్లు చేశాయి. ఇలా వార్తలు వచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఆమె మీద ఆగ్రహంగా వున్నట్లు తెలుస్తోంది. ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేసి, సికింద్రాబాదుకు కొత్త ఇంచార్జీని నియమించేలా కాంగ్రెస్ పార్టీ పెద్దలు పావులు కదుపుతున్నట్లు సమాచారం!
జయసుధ అంశంపై చర్చించేందుకు ఈరోజు (23-06-2015) ఉదయం టీ పీసీసీ నేతలు కీలక భేటీ నిర్వహించారు. ఈ భేటీలో ఉత్తమ్ కుమార్ రెడ్డితోపాటు టీ.సీఎల్పీ నేత జానారెడ్డి, పలువురు కీలక నేతలు పాల్గొన్నట్లు సమాచారం. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ నటి జయసుధకు ఫోన్ చేశారు. ఈ ఫోన్ సంభాషణల్లో భాగంగా ఆయన సికింద్రాబాదు నియోజకవర్గ ఇంచార్జీని మార్చాలనుకుంటున్నామని ఆమెతో చెప్పారని, ఈ విషయంలో తన అభిప్రాయాన్ని తెలియజేయాలంటూ కోరారట. ఇలా ఒక్కసారిగా నియోజకవర్గ ఇంచార్జీని మార్చాలన్న పార్టీ నిర్ణయంపై నోచుకున్న ఆమె.. ఉత్తమ్ ప్రశ్నకు కాస్త ఘాటుగానే సమాధానం ఇచ్చారు. ‘ఇంచార్జీగా మీ ఇష్టమొచ్చిన వారిని మార్చుకోండి.. నాకెలాంటి అభ్యంతరం లేదు’ అని ఆమె పేర్కొన్నారు.
జయసుథ ఈ విధంగా కఠువుగా సమాధానం ఇవ్వడాన్ని చూస్తుంటే.. ఆమె టీఆర్ఎస్ లోకి జంప్ అయ్యే అనుమానాలకు మరింత బలం చేకూరినట్లు తెలుస్తోంది. అంతేకాదు.. పార్టీ మారే విషయమై తనకున్న కాస్త ఇబ్బందినీ ఉత్తమ్ తీర్చారన్న భావనలో జయసుధ వున్నారని చెప్పుకుంటున్నారు. మరి.. జయసుధ పార్టీ మారుతారా? లేదా? అనేది తెలియాలంటే ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే!
AS
(And get your daily news straight to your inbox)
Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more
Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more
Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more
Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more
Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more