ఇటీవలే ఉగ్రవాది వికారుద్దీన్ ను పోలీసులు ఎన్ కౌంటర్ లో కాల్చి చంపిన విషయం తెలిసిందే! అయితే.. ఈ ఎన్ కౌంటర్ పలు అనుమానాలకు తావిస్తోందని కొందరు సందేహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఎంఐఎం నేతలు ఈ ఘటనను బూటకపు ఎన్ కౌంటర్ గా పరిగణించారు. ఈ ఎన్ కౌంటర్ ను ఎంఐఎం నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ, దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అయితే.. వీరు ఈ విధంగా విచారణకు డిమాండ్ చేయడంపై బిజెపి సీనియర్ నాయకుడు, ప్రస్తుత పార్లమెంటరీ వ్యవమారాల మంత్రి వెంకయ్యానాయుడు విచారం వ్యక్తం చేశారు.
వికారుద్దీన్ ఎన్కౌంటర్పై మాట్లాడుతున్న ఎంఐఎం నేతలు పోలీసులపై కాల్పులు జరిపినప్పుడు ఎందుకు స్పందించలేదని వెంకయ్య ప్రశ్నించారు. ఎంఐఎం నేతలు ఉగ్రవాదుల పక్షాన మాట్లాడటం సరికాదన్నారు. అదే సూర్యాపేట, అంతకుముందు జరిగిన కాల్పుల్లో పోలీసు అధికారులు చనిపోతే ఎందుకు నోరువిప్పలేదని ఆయన మీడియా సాక్షిగా ప్రశ్నించారు. సిమీ కార్యకర్తలను చంపితే మానవ హక్కులు గుర్తుకొస్తాయా అని అన్నారు. తాను మాత్రం ఉగ్రవాదులను అస్సలు సహించనని, వారిని ఎట్టి పరిస్థితుల్లో అయినా వ్యతిరేకిస్తానని అన్నారు. సామాన్యులు చనిపోతే స్పందించని హక్కుల నేతలు.. ఉగ్రవాదులు చనిపోతే స్పందించడం విచారకరమని పేర్కొన్నారు.
ఇక తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఎన్ కౌంటర్లపై కేంద్రం జోక్యం చేసుకోదని వెంకయ్య స్పష్టం చేశారు. శాంతిభద్రతల అంశం రాష్ట్రాల పరిధిలోనిదని ఆయన తెలిపారు. తీవ్రవాది జకీర్ రెహ్మాన్ లఖ్వీ విడుదలను కేంద్రం తీవ్రంగా వ్యతిరేకిందని చెప్పిన ఆయన.. అతడిని అలా విడుదల చేయడం చాలా దురదృష్టకరమని పేర్కొన్నారు.
AS
(And get your daily news straight to your inbox)
Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more
Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more
Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more
Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more
Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more