తెలంగాణ ఐటీ, పంచాయితీరాజ్ మినిష్టర్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) బీజేపీ-టీడీపీ కూటమిపై ధ్వజమెత్తారు. బీజేపీ పార్టీకి మద్దతిస్తే.. చంద్రబాబు నాయుడుకి మద్దతిచ్చినట్లేనని ఆయన అన్నారు. కాబట్టి.. బీజేపీ అభ్యర్థులను ఓడించాలంటూ ఆయన పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా మాట్లాడిన ఆయన.. ఇలా తన అభిప్రాయాలను వెల్లడించారు.
* తెలంగాణ అభివృద్ధిని అడగడుగునా అడ్డుకుంటున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మద్దతిస్తున్న బీజేపీ మండలి అభ్యర్థులను ఓడించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.
* పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల్లో నిలబడ్డ బీజేపీ అభ్యర్థులకు ఓటేస్తే.. అది తేదేపా అధ్యక్షుడు చంద్రబాబుకు వేసినట్లేనని ఆయన అన్నారు.
* తెలంగాణాలో బీజేపీ, టీడీపీ మిత్రపక్షాలైతే.. చెరో స్థానంలో పోటీచేయాలని సవాల్ విసిరారు.
* తాము అభ్యర్థలను నిలిపితే ఓడిపోతామని భావించే, భాజపాను అడ్డంపెట్టుకుని బాబు శిఖండి రాజకీయాలు చేస్తున్నారంటూ నిప్పులు చెరిగారు.
* భాజపా అభ్యర్థుల గెలుపుకోసం రూ.కోట్లు కుమ్మరించి ఓట్లు కొనేందుకు ప్రయత్నిస్తున్నారని, దీన్ని అడ్డుకోవాలని ఆయనకోరారు.
(And get your daily news straight to your inbox)
Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more
Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more
Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more
Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more
Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more