కాంగ్రెస్ లో ఉన్నపుడు కీలక నేతగా ఉన్న కావూరి సాంబశివరావు ఎన్నికల ముందు బిజెపి లో చేరిన మాజీ కేంద్ర మంత్రి సాంబశివరావు ఎ పి రాష్ట్ర భావిస్త్యత్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ ఎన్నికలలో వై ఎస్ ఆర్ సి పి పార్టీ ప్రతి పక్షం లో ఉన్నప్పటికీ, వచ్చే ఎన్నికల నాటికి పూర్తిగా తుడిచి పెట్టుకుపోయి బిజెపి బలోపేతం అయి రాష్ట్రము లో బిజెపి, టిడిపిలే ఎపిలో మిగులుతాయని ఆయన అన్నారు. పోటీ కూడా జాతీయ పార్టీ అయిన బిజెపికి, ప్రాంతీయ పార్టీ అయిన టిడిపికి మధ్యే జరుగుతుందని అనడం ద్వారా భవిష్యత్తులో పొత్తు ఉండకపోవచ్చనన్న సంకేతాన్ని కావూరి ఇస్తున్నారు. ప్రస్తుతం టీడీపీకి ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ వచ్చే ఎన్నికలకు కనుమరుగైపోవచ్చన్నారు. ఉత్తర భారత దేశంలో పూర్తి ఆదిపత్యం సాధించిన బిజెపి దక్షిణాదిలో ను చేయవచ్చని జోస్యం చెప్పారు. టీడీపీకి బలహీన భాగస్వామిగా ఉన్న బీజేపీ తొందర్లోనే బలమైన భాగస్వామి అవుతుందని , ఆ తర్వాత రాబోయే రోజుల్లో రాష్ట్రంలో బీజేపీ ఒక బలమైన సింగిల్ పార్టీగా మారుతుందని అన్నారు.
బిజెపి పార్టీ త్వరలో తన క్యాడర్ ను విస్తరించుకొని రాష్ట్రము లో బలంగా తయారవుతుందని దానికి కార్యకర్తలందరూ కృషి చేస్తున్నారని., భవిష్యత్ బిజెపి పార్టీ టిడి పి పార్టీ ని మాత్రమే ఎదుర్కోవాల్సి వస్తుందని.., కచ్చితంగా ఇపుడు కాకపోయినా భవిష్యత్ రాష్ట్రము లో బిజెపి పార్టీ అధికారం లోకి వచ్చి తీరుతుందని వ్యాఖ్యలు చేసారు. ఇదెలా సాధ్యమో కావూరి సంబాశివ రావె చెప్పాలని టి.డి.పి నేతలు చెవులు కొరుక్కుంటున్నారు.
హరి
(And get your daily news straight to your inbox)
Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more
Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more
Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more
Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more
Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more