విశాఖపట్నం లోదామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వ విద్యాలయం మొదటి స్నాతకోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సుప్రీమ్ కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్.ఎల్.దత్తు సుప్రీమ్ కోర్టు న్యాయమూర్తి ఎన్.వి రమణ, ఏ.పి & తెలంగాణా రాష్ట్రాల ఉమ్మడి హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్ జ్తోతిసేన్ గుప్త, ఏ.పి సిఎం చంద్రబాబు హాజరయ్యారు. ఈ కార్యక్రమం లో సుప్రీమ్ కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్.ఎల్.దత్తు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ... "మీరు పోటి ప్రపంచం లోకి అడుగు పెడుతున్నారు. సవాళ్ళు, అడ్డంకులు, మిమ్మల్ని మరింత బలోపేతం చేస్తాయని వివరించారు. నెల్సన్ మండేలా చెప్పినట్లు చదువు ను మించిన ఆయుధం లేదని, దీని ద్వారానే ప్రపంచాన్నే మార్చగలమన్నారు. ఎక్కడ ధర్మం వర్దిల్లుతుందో అక్కడ విజయం ఉంటుందన్నారు.
ఈ సూత్రాన్నే అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీమ్ కోర్ట్ కూడా అవలంభిస్తుందన్నారు. చదువు ముగించుకొని సవాళ్లు అనే క్రొత్త ప్రపంచంలోకి అడుగు పెడుతున్న విద్యార్థులంతా ఎంచుకున్న రంగం లో విజయం సాధించాలని ఆకాంక్షించారు. వివేకానంద స్వామి చెప్పినట్లు అంతు లేని ఉత్సాహం, వెనకడుగు వేయని ధైర్యం, ఓర్పుతో ఎవరైతే ముందుకేల్తారో వారు విజయం సాధిస్తారని, విద్యార్థులంతా న్యాయం వైపే ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లో ఏ విషయం కూడా రాజీ పడరాదని చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more
Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more
Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more
Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more
Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more