(Image source from: ap cm chandrababu naidu released white papers of farmer loans)
* ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యవసాయ, అనుబంధ రంగాలపై శ్వేతపత్రం విడుదల చేసిన సందర్భంలో ఆయన రైతు రుణమాఫీల మీద కొన్ని వ్యాఖ్యలు గుప్పించారు.
* లేక్ వ్యూ అతిథిగృహంలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన చంద్రబాబు.. రుణమాఫీ వల్ల మాత్రమే రైతుల సమస్యలు పరిష్కారం అవుతాయని అనుకోవడం చాలా తప్పని పేర్కొన్నారు.
* కాంగ్రెస్ అసమర్థ విధానాలను పాటించడం వల్లే నేడు రైతులు అప్పుల సుడిగుండంలో మునిగిపోయారని చెప్పిన ఆయన... కాంగ్రెస్ పాలనలో పెట్టుబడులు పెరిగి, దిగుబడులు పూర్తిగా తగ్గిపోయాయని అన్నారు.
* అప్పట్లో గిట్టుబాటు ధరలు లేకపోవడం వల్లే రైతులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కున్నారని, 2005 నుంచి 2013 వరకు అనుకూల పరిస్థితులు వున్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయాన్ని సర్వనాశనం చేసిందని ఆయన ఆరోపణలు చేశారు.
* భూసార పరీక్షలు చేయడంలో నిర్లక్ష్యం చేయడమే కాకుండా.. మేఘమథనం పేరుతో కాంగ్రెస్ కాసుల వర్షం కురిపించుకుందని, సహజవనరులను విచ్చలవిడిగా దోచుకుని రైతులను అన్యాయం చేసిందని ఆయన తీవ్రంగా మండిపడ్డారు.
* రైతులు ఇబ్బందుల్లో వున్నందువల్లే రుణమాఫీ అమలు చేస్తున్నామని... వారికి వచ్చిన నష్టాలను తుడిచేస్తూ, కరువులను ఎదుర్కునే విధంగా ప్రభుత్వ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
* వ్యవసాయ సమస్యలను పరిష్కారంలో మొదటి చర్యగా రుణమాఫీని అమలు చేసి, వ్యవసాయ ఆదాయాన్ని పెంచుకునేవిధంగా అనుకూలమైన అన్నీ మార్గాలను అన్వేషిస్తామని ఆయన మాటిచ్చారు. అలాగే వ్యవసాయ అనుబంధ రంగాల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్నారు.
* పంట రక్షణకు సాంకేతిక విధానాలను అమలు చేయడంతోపాటు ఆధునిక పద్ధతుల ద్వారా ఎక్కువ లాభాలు వచ్చేలా ప్రణాళికలను సిద్ధం చేస్తామన్నారు.
* కాంగ్రెస్ విధానాల వల్ల క్షీణించిన రైతుల జీవన ప్రమాణాలను తిరిగి పెంచేందుకు ప్రత్యేక చర్యలను అమలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు.
* అప్పులు ఎక్కువగా వున్న రైతులు ఆత్మహత్య చేసుకోకుండా ధైర్యంగా వుండమని, ఆత్మహత్య చేసుకోవడం వల్ల అన్ని సమస్యలు పరిష్కారం కావని చెప్పిన ఆయన... రైతుల భారాన్ని ప్రభుత్వం తమ భుజస్కందాలపై వేసుకుని, వారికి కావాల్సిన అవసరాలను చేకూర్చడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా వుంటుందని ఆయన హామీ ఇచ్చారు.
AS
(And get your daily news straight to your inbox)
Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more
Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more
Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more
Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more
Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more