(Image source from: apngo president ashok babu fires on kcr and telangana government)
* ఏపీఎన్జీవోల సంఘ అధ్యక్షుడు అశోక్ బాబు... శనివారం గుంటూరు విలేకరులతో ప్రస్తుతమున్న పరిస్థితుల గురించి మాట్లాడారు.
* ఏపీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అయిన పరుచూరి అశోక్ బాబు... కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్రంగా విమర్శలు గుప్పించారు.
* రాష్ట్ర విభజన జరిగిన ఇన్నిరోజులయినా... ఇంతవరకు ఐఏఎస్ అధికారుల పంపిణీ ప్రక్రియను కేంద్రప్రభుత్వం ఇంకా పూర్తి చేయలేదని దుయ్యబట్టారు. అలా చేయకపోవడం వల్ల దిగువస్థాయిలో పరిపాలనకు కొంత ఇబ్బందిగా ఎదురవుతోందని ఆయన వ్యాఖ్యానించారు.
* గుంటూరు విలేకరుల సమావేశంలో మాట్లాడిన అశోక్ బాబు.. ఐఏఎస్ అధికారుల పంపిణీ ప్రక్రియను సాధ్యమైనంతవరకు స్పష్టత రావాల్సి వుందని ఆయన అభిప్రాయపడ్డారు.
* అలాగే ‘‘విభజన వల్ల నష్టపోయేది కేవలం ఉద్యోగులేనని తాము మొదటినుంచి చెప్పుకుంటూ వస్తున్నామని... ప్రస్తుతం ఇప్పుడు అదే పరిస్థితి ఏర్పడిందని’’ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
* సచివాలయం పంపిణీలో సరైన సౌకర్యాలు లేని భవంతులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, మంచి సౌకర్యాలున్న భవనాలను తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చి అన్యాయం చేస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు.
* ఏపీఎన్జీవోలకు కేటాయించిన భూములను వెనక్కు తీసుకోవడం సమంజసం కాదని తన మనసులోని భావాలను వ్యక్తపరిచారు.
* ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుకి అశోక్ బాబు సలహాలిస్తూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని ఎక్కడ అనే విషయం త్వరగా తేలితేనే ఉద్యోగస్తులకు తమ ఆప్షన్లను ఎంచుకునే వీలుంటుందని చెప్పిన ఆయన... ఈ విషయాన్ని చంద్రబాబు త్వరగా పరిశీలించాలని సూచించారు.
AS
(And get your daily news straight to your inbox)
Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more
Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more
Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more
Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more
Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more