యువ నేత పై గంపెడాశలు పెట్టుకుంది కాంగ్రెస్ పార్టీ. తొమ్మిది సంవత్సరాల నుండి అధికారంలో కొనసాగుతున్న యుపిఎ కు రానున్న ఎన్నికలలో మళ్లీ మెజారిటీ సీట్లు రావడం కష్టం అని ఇటీవల కొన్ని సర్వేలు తెలిపాయి. అయితే, రాహుల్గాంధీని కాంగ్రెస్ పార్టీకి ఉపాధ్యక్షునిగా నియమించి “భావి ప్రధాని’గా ప్రచారం చేయడంతో యుపిఎలో మళ్లీ ఆశలు చిగురించాయి. ఇందుకు తగినట్లు వైరికూటమి అయిన ఎన్డిఎ బలహీనపడటంతో యుపిఎ వర్గాల ఆనందానికి హద్దుల్లేకుండాపోతున్నది. ఎన్డిఎ నుంచి ఇటీవల బలమైన నాయకుడు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ (జనతాదళ్ -యు) తప్పుకోవడంతో బిజెపికి ఇప్పుడు అకాలీదళ్, శివసేన వంటి రెండు పార్టీలు మాత్రమే మిత్రపక్షాలుగా మిగిలాయి.
ఒకప్పుడు తొమ్మిది పార్టీలు మిత్రపక్షాలుగా వుండేవి. ఇందుకు తగినట్లు బిజెపి కూడా అంతర్గత కుమ్ములాటలు ప్రారంభం కావడంతో కాంగ్రెస్కు కలిసొచ్చే అంశాలు అనేకం కనబడుతున్నాయి.కర్ణాటకలో అవినీతి ఆరోపణల కారణంగా ఓటమి పాలవడం, కుమ్ములాటలతో పార్టీ భ్రష్టుపట్టి ఓడిపోవడం. జాతీయ నాయకులు సైతం పరస్పరం విమర్శలు చేసుకోవడం సర్వసాధారణమైంది. అద్వానీ వంటి సీనియర్ నాయకుడు రచ్చకెక్కడం వల్ల పార్టీ ప్రతిష్ట మరింత దెబ్బతింది. బిజెపికి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ జనాకర్షణ గల నాయకునిగా భావి ప్రధానిగా ప్రచారం జరుగుతుండటంతో ఆ ప్రచారమే పార్టీకి గుదిబండగా మారింది. గుజరాత్ వరకు నరేంద్ర మోడీ ఎదురులేని నాయకుడైనప్పటికీ దేశవ్యాప్తంగా ఆ స్థాయికి ఎదగాలంటే చాలాకష్టం.నరేంద్రమోడీ వల్ల ముస్లిం ఓట్లు దూరమవుతాయనే భయంతోనే ఎన్డిఎ నుంచి బీహార్ ముఖ్యమంత్రి నితిష్ కుమార్ వైదొలగారు.. థర్డ్ ఫ్రంట్’ ఏర్పాటు కేవలం ఊహాగానాలకే పరిమితం అయింది.
ఒకవేళ అది ఏర్పడినా గత అనుభవాల దృష్ట్యా ఎక్కువకాలం నిలవదనే అభిప్రాయం నాటుకుపోయింది. యుపిఎ లోని పార్టీలను కాపాడుకోవడంతో పాటు స్వంతంగా పార్టీకి ఎంపిల సంఖ్యను పెంచుకొనే స్థాయిలో కాంగ్రెస్ నాయకులు సమాలోచనలు చేస్తున్నారు. కేంద్ర రాజకీయాలకు వచ్చేసరికి రాహుల్ గాంధీని బలపరిచేవాళ్లు అనేకమంది అక్కడున్నారు. లగడపాటి రాజగోపాల్ లాగా ఎన్నికల ముందర వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా సర్వే జరిపించే ప్రక్రియలో మరో కాంగ్రెస్ నాయకుడు ముందుకు వచ్చాడు. ఈ నాయకుని పేరు ఎం.షాజహాన్ బాష, మదనపల్లె ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. గులాం నబీ ఆజాద్, అహ్మద్ పటేల్ వంటి అగ్రనాయకులతో షాజహాన్ బాషకు నేరుగా పరిచయాలు వున్నాయి.
రాష్ట్రంలో దూరమైన సామాజిక వర్గాల స్థానంలో పూడ్చుకోవలసిన విధానాన్ని, దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ నిరాడంబర జీవితాన్ని, అతని లక్ష్యాన్ని ప్రజలు ఏమనుకుంటున్నారు? “నవ భారత్’ ఎలా వుండాలి? అనే అంశాలమీద 25 రాష్ట్రాలు, ఏడు కేంద్ర పాలిత ప్రాంతాలనందు అధ్యయనం జరిపి “రాజీవ్ భారతం’ అనే పుస్తకంలో పొందుపరచి ఆగస్టు 20న ఢిల్లీలో రాజీవ్గాంధీ జయంతి రోజున రాహుల్గాంధీ చేతులమీదుగా ఆవిష్కరించాలని షాజహాన్ బాష ప్రణాళిక రూపొందించారు. తెలుగు, హిందీ, ఇంగ్లీషు భాషలలో పుస్తకం ప్రచురిస్తున్నట్లు ఈ ప్రతినిధికి తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more