Shilpa shetty introduce a new gold scheme for middle class people

Shilpa shetty introduce a new gold scheme for middle class people, shilpa shetty latest news, shilpa shetty with husband, shilpa shetty introduce new gold scheme, shilpa shetty and raj kundra starts new gold scheme, shilpa shetty starts gold scheme, shilpa shetty and her husband starts gold scheme for middle class people

Shilpa shetty introduce a new gold scheme for middle class people

బంగారం ఆశ చూపి, డబ్బులు గుంజుతున్న తార!

Posted: 07/12/2014 05:16 PM IST
Shilpa shetty introduce a new gold scheme for middle class people

(Image source from: Shilpa shetty introduce a new gold scheme for middle class people)

కొంతమంది వ్యాపారస్తులు తమ సొంత లాభార్జన కోసం చిట్టీల పేరుతో వివిధ రకాల పథకాలను అమలు చేస్తుంటారు. ఈ వ్యాపారస్తులు మొదట ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసుకుని, వాటిని వారికన్నా బడావ్యాపారస్తులకు కొంతవరకు వడ్డీకి ఇచ్చుకుంటారు. దాంతో వీరు తమ వ్యాపారాలను అభివృద్ధి చేసుకుంటూ.. తమ దగ్గర పెట్టుబడి పెట్టినవారికి కొంతవరకు న్యాయం చేస్తూ... తిరిగి వారి డబ్బుల్ని వారికి ఇచ్చేస్తారు. ఇవి సాఫీగా సాగితే ఫర్వాలేదు కానీ... కొంతనష్టం వాటిల్లితే మాత్రం బ్యాంకుకు చిల్లు పడినట్టే! వ్యాపారం పేరుతో చిట్టీలు నిర్వహించుకున్న దివాలా పేరుతో మొత్తం డబ్బు తీసుకుని ఉడాయిస్తారు. ఇటువంటి మోసాలు మన భారతదేశంలోనేకాదు.. యావత్తు ప్రపంచం మొత్తం బహిరంగంగానే జరుగుతూనే వున్నాయి. అటువంటి సమయంలో ఎవరి దగ్గరయినా పెట్టుబడి పెట్టేముందు పెట్టుబడిదారుల వివరాలను ముందుగానే తెలుసుకుంటే చాలా మంచిది!

ఇదంతా వేరే విషయం! తాజాగా ఒక ఐపీఎల్ టీంకు యాజమాన్యం వహిస్తున్న బాలీవుడ్ నటి శిల్పాశెట్టి, అతని భర్తతో కలిసి ఇటువంటి తరహాలోనే డబ్బులు సంపాదించడానికి పెద్ద ప్లాన్ వేసినట్టు సమాచారం! గోల్డ్ స్కీమ్ అనే పేరుతో నిర్వహించునున్న ఈ చిట్టీని నెలానెలా కేవలం రూ.1000 పెట్టుబడి పెట్టి మీ సొంతం చేసుకోవచ్చని సామాన్య జనాలను ఊరిస్తోంది.

‘‘మీరెవరైనా బంగారం కొనాలనుకుంటున్నారా..? అలా అయితే మా గోల్డ్ స్కీమ్ ను ఆశ్రయించండి. బంగారం కొనాలనుకునేవారికి ఒకేసారి పెద్ద మొత్తంలో వెచ్చించాల్సిన అవసరం లేదు. అలాగే దరలు పెరిగిపోతాయని భయపడాల్సిన పనిలేదు. ఏ కస్టమర్ ఎంతవరకైతే తన అకౌంట్ లో డబ్బులు జమ చేసుకుని వుంచుకుంటారో... అంత మొత్తానికే వారికి బంగారం లభిస్తుంది. నెలానెలా కేవలం రూ.1000 మాత్రమే పెట్టుబడి పెట్టండి. కానీ మొదట నాలుగు దశాంశ స్థానాల వరకు లిమిటేషన్ వుంటుంది. అప్పటివరకు బంగారం ఇవ్వడం కుదరదు’’ అని తన గోల్డ్ స్కీమ్ గురించి వివరిస్తూ... అందరినీ ఊరిస్తోంది.

దీంతోపాటు మరొక క్లారిఫికేషన్ కూడా ఇచ్చుకుంది. ‘‘ఒకవేళ మ పథకాన్ని ఎప్పుడైనా ఆపేస్తే... పెట్టుబడిదారులకు తమ మొత్తాన్ని బంగారం రూపంలో వెనక్కు ఇచ్చేస్తాం. అదికూడా 24 క్యారెట్ల స్వచ్ఛత గల బంగారాన్నే ఇస్తామని మాటిస్తున్నాం’’ అని వాగ్ధానాలు కూడా చేస్తోంది. ఈ స్కీమ్ ప్రత్యేకంగా సామాన్య ప్రజలకు ప్రవేశపెడుతున్నామని పేర్కొన్న ఈ భామ... ఇందులో పెట్టుబడి పెట్టిన పేదప్రజలకు ఇది ఎంతో ఉపయోగకరమైందని చెప్పుకుంటూ వచ్చింది.

అటు ఐపీఎల్ లో, ఇటు వస్త్ర దుకాణాల్ని ప్రపంచస్థాయిలో వ్యాపారాలను నడిపించడంలో వీరికి వీరే సాటి! ఇక శిల్పా భర్త రాజ్ కుంద్రా ఇటువంటి వ్యాపారాల్లో ఆరితేరినవాడు. ప్రపంచంలో వున్న వ్యాపారస్తులలో ఇతను కూడా ఒకడు. ఎంతో తెలివైనవాడు. వీరిద్దరికీ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో వ్యాపారాలు వున్నప్పటికీ ఇటువంటి సాధారణ గోల్డ్ స్కీమ్ ను, అది కూడా సామాన్య ప్రజల కోసం ఎందుకు పెడుతున్నారోనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరికొంతమంది మాత్రం ఈ స్కీమ్ పేదప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని, తమ భవిష్యత్తును చక్కదిద్దుకోవడానికి ఈ స్కీమ్ సహాయపడుతునందని తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఏదైతేనేం.. ఈ ప్రేమజంటలు మాత్రం సామాన్య ప్రజలను తమ బుట్టలో పడేయడంలో చివరికి విజయం సాధించారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles