సినీ నటుడు, చిత్తూరు మాజీ ఎంపీ శివప్రసాద్ కన్నుమూశారు. గత కొంతకాలంగా మూత్రపిండాలకు సంబంధించిన సమస్యతో బాధపడుతున్న శివప్రసాద్ కు చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పోందుతూ ఇవాళ మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని అపోలో అసుపత్రి వర్గాలు అధికారికంగా దృవీకరించాయి. ఇటు శివప్రసాద్ కుటుంబసభ్యులు కూడా ఆయన మరణవార్తతో శోకసంధ్రంలో మునిగిపోయారు.
నాలుగు రోజుల క్రితం ఆయన పరిస్థితి విషమించడంతో తిరుపతిలోని ప్రైవేటు అసుపత్రి నుంచి ఆయనను హుటాహుటిన చెన్నైలోని అపోలో అసుపత్రికి తరలించిరు. ఆయనకు ఇక్కవ వైద్యులు చికిత్సనందిస్తున్న క్రమంలో నిన్న ఒక్కసారిగా ఆయన మరణించారన్న వార్తలు వచ్చాయి. అయితే అసుపత్రి వర్గాలతో పాటు శివప్రసాద్ కుటుంబసభ్యులు ఈ వార్తలను ఖండించారు. ఆయన ఆరోగ్యం అత్యంత విషమంగా వుందని.. ఆయనకు వెంటిలేటర్ పై శ్వాసను అందిస్తున్నామని అసుపత్రి వర్గాలు తెలిపాయి.
కాగా, శివప్రసాద్ మరణవార్తతో టీడీపీ అధినేత కూడా దిగ్భ్రాంతికి గురయ్యారు. శివప్రసాద్ మరణంపై స్పందించిన ఆయన.. తన చిరకాల మిత్రుడు చనిపోవడం విచారకరమన్నారు. ప్రత్యేక హోదా సహా విభజన హామీల అమలు కోసం శివప్రసాద్ ఎంపీలందరితో కలసి రాజీలేని పోరాటం చేశారని గుర్తు చేసుకున్నారు. ఆయన మృతి చిత్తూరు జిల్లాకే పరిమితం కాకుండా యావత్ రాష్ట్రానికే తీరని లోటన్నారు. శివప్రసాద్ కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుబూతిని తెలిపారు.
నా చిరకాల మిత్రుడు, మాజీ ఎంపీ, టీడీపీ నేత, డా.ఎన్ శివప్రసాద్ గారి మరణం విచారకరం. ప్రత్యేక హోదా సహా విభజన చట్టంలో హామీల అమలు కోసం రాజీలేని పోరాటం చేశారు. ఆయన మృతి చిత్తూరు జిల్లాకే కాకుండా, మొత్తం ఆంధ్ర రాష్ట్రానికే తీరని లోటు.
— N Chandrababu Naidu (@ncbn) September 21, 2019
అటు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా ఎంపీ శివప్రసాద్ మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పార్టీలకు అతీతంగా ఆయన రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్లమెంటు లోపలా బయటా పోరాటం చేశారని, ఈ సందర్భంగా ఆయన జాతీయ నేతలతో పాటు జాతీయ మీడియా దృష్టిని కూడా అకర్షించని నేతగా మారారని ప్రశంసించారు. శివప్రసాద్ మృతిపట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన జగన్.. ఆయన కుటుంబసభ్యలకు తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు.
Andhra Pradesh Chief Minister Sri YS Jagan Mohan Reddy expressed grief over the death of former MP and Ex Minister Sri N. Siva Prasad and conveyed condolences to the bereaved family members.
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) September 21, 2019
శివప్రసాద్ 2009లో టీడీపీ తరపున చిత్తూరు ఎంపీగా పోటీ చేసి గెలిచారు. తర్వాత 2014 ఎన్నికల్లోనూ ఘన విజయం సాధించారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి రెడ్డప్ప చేతిలో ఓడిపోయారు. విభజన హామీలు, ప్రత్యేక హోదా ఉద్యమాల్లో శివప్రసాద్ తన వేషాలతో వెరైటీగా నిరసన తెలిపి తమ సమస్యలను పాలక ప్రభుత్వాలకు తెలిపడంతో పాటు జాతీయ మీడియా దృష్టిని ఆకర్షంచాడు. హోదా హామీని నెరవేర్చాలంటూ పార్లమెంట్ ముందు వెరైటీ వేషధారణల్లో ఆందోళనలు చేసి అందరి దృష్టిని ఆకర్షించారు.
చిత్తూరు జిల్లాలోని పూటిపల్లి 1951 జూలై 11న అప్పటి మద్రాస్ రాష్ట్రంలో జన్మించారు. శివప్రసాద్ కు చిన్నప్పటి నుంచి నాటకాలు చూడటం కన్న వాటిలో నటించాలంటేనే చాలా ఇష్టం. ఆ ఇష్టంతోనే ఆయన చిన్ననాటి నుంచి నాటకాలు వేస్తూ స్వతహాగా రంగస్థల నటుడిగా రాణించారు. ఆ తర్వాత పలు సినిమాల్లో తనదైన విక్షలణ నటనను ప్రదర్శించారు. పలు చిత్రాలలో ప్రతినాయకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మెప్పించారు. ప్రేమ తపస్సు, టోపి రాజా స్వీటీ రోజా, ఇల్లాలు, కొక్కొరొకో అనే నాలుగు సినిమాలకు దర్శకత్వం కూడా వహించారు. సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more