Rains may continue for three more days: IMD తెలుగురాష్ట్రాలకు మూడు రోజుల పాటు వర్ష సూచన

Telugu states to receive heavy rains over the next three days

Bay of Bengal, Telangana, Telangana weather, Telangana rains, Rains in Andhra Pradesh, upper air cyclonic circulation, moderate rainfall in Telangana, Krishna, Godavari, Karnataka, Maharashtra, Uttar pradesh, Madya Pradesh, depression, Rains in Telangana, Rain Forecast

IMD predicts light to moderate rainfall tomorrow and continues three more days in hyderabad and other districts of Telangana due to upper air cyclonic circulation over south Interior at bay of bengal & neighbourhood.

తెలుగురాష్ట్రాలకు మూడు రోజుల పాటు వర్ష సూచన

Posted: 09/18/2019 10:07 AM IST
Telugu states to receive heavy rains over the next three days

తెలుగు రాష్ట్రాల్లో వరుణుడు కాస్త శాంతించాడని అనుకునే లోపు మళ్లీ విజృంభిస్తున్నాడు. తెలుగు రాష్ట్రాలల్లోని  అనేక ప్రాంతాల్లో వరుణుడు తన ప్రతాపాన్ని చాటుతున్నాడు. బంగాళాఖాతంలో పశ్చిమమధ్య ప్రాంతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి కారణంగా గత రెండ్రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉపరితల ఆవర్తనం ప్రభావం కారణంగా తెలుగు రాష్ట్రాలలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని అర్డీజీఎస్ తెలిపింది. కర్నూలు, ప్రకాశం, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి.

రాయలసీమ జిల్లాలతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు వివరించారు. అదే సమయంలో తూర్పు గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొన్నారు. రాయలసీమలో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశముందని ఆర్టీజీఎస్ తాజా బులెటిన్ లో హెచ్చరించింది. భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతాయని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని స్పష్టం చేసింది.

ఇక ఇటు తెలంగాణలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ నగరంలో నిన్నటి నుంచి, నేటి ఉదయం వరకూ కురిసిన భారీ వర్షంతో నగరంలో కొంత ట్రాఫకి్ జమ్ అయ్యింది. ప్రతీ రోజు రాత్రి సమయంలో కురుస్తున్న వర్షంతో గ్రౌండ్ వాటర్ లెవల్ పెరుగుతోందని, అయితే ఇబ్బందులు మాత్రం తాత్కాలికమేనని నగరవాసులు సంబరపడుతున్నారు. హైదరాబాద్ లో గత రాత్రి 10 గంటల నుంచి రెండు గంటల వరకూ వర్షం పడుతూనే ఉంది.

ఖైరతాబాద్, నాంపల్లి, అమీర్ పేట, కూకట్ పల్లి, దిల్ సుఖ్ నగర్, లింగంపల్లి, మెహిదీపట్నం తదితర ప్రాంతాల్లో కుంభవృష్టి కురిసింది. రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ఈ ఉదయం పలు ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇళ్లలోని నీటిని బయటకు తోడుకునేందుకు ప్రజలు నానా అవస్థలూ పడాల్సి వచ్చింది. వర్షం తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కరెంట్ సరఫరాకు అంతరాయం కలిగింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles