మోటార్ వాహనాల చట్టానికి సవరణలు చేసి కొత్త చట్టాన్ని అమల్లోకి తీసుకురావడం తద్వారా వాహనదారులపై భారీ జరిమానాలు విధిస్తున్నారు పోలీసుల. ఈ క్రమంలో దీనిపై యావత్ దేశవ్యాప్తంగా అనేక విమర్శలు వెల్లివిరయడం.. షోషల్ మీడియా వేదికగా విమర్శలు తారాస్థాయికి చేరిన తరుణంలో ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం దిగివచ్చింది. ఈ విషయమై రాష్ట్రాలదే తుది నిర్ణయమని కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ స్పష్టంచేశారు.
ఈ తరుణంలో రాష్ట్రాలు సవరించిన మోటార్ వాహనాల చట్టం మేరకు భారీగా పెంచిన జరిమానాలను వ్యతిరేకిస్తున్నాయి. ఇక ముఖ్యంగా బీజేపి పాలిత రాష్ట్రాల్లోనే ఈ వ్యతిరేకత మరింత అధికంగా వుందని సమాచారం. అయితే ప్రభుత్వాలు వ్యతిరేకిస్తున్నా.. పోలీసులు మాత్రం ఈ చట్టాన్ని అడ్డం పెట్టుకుని సామాన్యులకు నరకం చూపిస్తున్నారని చెప్పడానికి ఇప్పటికే పలు ఘటనలు రుజువుచేశాయి. నిబంధనలు ఉల్లంఘించకపోయినా ఆటోలో హెల్మెట్ పెట్టుకోలేదనీ, బైక్ పై సీటు బెల్టు పెట్టుకోలేదని, కారులో హెల్మెట్ పెట్టుకోలేదని పోలీసులు చలానాలు రాసిన ఘటనలను చూశాం.
దీంతో ప్రజలు సొంత వాహనాలను బయటకు తీయాలంటేనే వణికిపోతున్నారు. తాజాగా పొలం వద్ద ఎద్దుల బండి పెట్టుకున్నందుకు పోలీసులు ఓ రైతుకు జరిమానా విధించారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ కు చెందిన హసన్ అనే రైతు తన పొలం వద్ద ఎద్దుల బండిని నిలిపిఉంచాడు. ఈ నేపథ్యంలో దాన్ని గమనించిన పోలీసులు హసన్ ఇసుకను అక్రమంగా తరలిస్తున్నాడని అనుమానించారు. అనంతరం హసన్ ఇంటికి వెళ్లి రూ.1,000 జరిమానాను అందజేశారు.
దీంతో తిక్కరేగిన హసన్..‘అసలు ఎద్దులబండి మోటార్ వాహనాల చట్టం పరిధిలోకి ఎలా వస్తుంది?’ అంటూ తీవ్రంగా మండిపడ్డాడు. రైతు ఎదురు ప్రశ్నించడంతో తమ తప్పు తెలుసుకున్న పోలీసులు చలాన్ రద్దుచేసి అక్కడి నుంచి చల్లగా జారుకున్నారు. ఈలోగా ఈ విషయం మీడియాలో వైరల్ కావడంతో వాస్తవానికి హసన్ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలనీ, అయితే అతను తప్పు చేయలేదని తేలడంతో చలాన్ ను వెనక్కు తీసుకున్నామని పోలీసులు వివరణ ఇచ్చారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more