అడవి తల్లి బిడ్డలైన చెంచులను మనం భారతీయులుగా గుర్తుస్తున్నామా.? వారికి ఫౌరులందిరికీ వర్తించే హక్కులనుకల్పిస్తున్నామా.? ఒక్కసారి అలోచించాల్సిన అవసరం ఎంతైనా వుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రభుత్వాలను నిలదీశారు. ఈ మేరకు ఆయన నల్లమల అడవితల్లి నమ్ముకుని జీవితాలను సాగదీస్తున్న చెంచులకు సంబంధించిన వీడియో తన ట్విట్టర్ ఖాతాలో రిలీజ్ చేశారు.
నల్లమల యురేనియం తవ్వకాలపై అఖిలపక్ష నేతలతో క్రితం రోజున పవన్ కల్యాణ్ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించిన విషయం తెలసిందే. ఈ సందర్భంగా అడవులను ధ్వంసం చేసి.. పర్యావరణాన్ని కలుషితం చేసి.. మానవజాతి మనుగడతో పాటు జల,జంతు, పశుపక్షాది జాతుల ఉనికి కూడా ప్రశ్నార్థకంగా మార్చే యురేనియం మైనింగ్ తవ్వకాలను ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకుంటామని అన్నారు. ఆయన ప్రతిపాదనలకు అఖిలపక్ష పార్టీల నేతలు కూడా తమ గళం కలిపారు.
కాగా, ఈ సమావేశానకి చెంచు నాయకుడు మల్లికార్జున్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన మల్లికార్జున్ అడవితల్లిని మా గుండెలో పెట్టుకొని చూసుకుంటామన్నారు. ఎవరు అడవిలోకి ప్రవేశించాలని తమ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుందన్నారు. కానీ ఇవాళ అడవుల్లో మాకు జీవించే హక్కు కూడా లేకుండా పోతుందన్నారు. అడవి మాకు గుండెకాయ లాంటిది. మా గుండెకాయ తీయకండి అంటూ ఆయన ఆవేదన వ్యక్తంచేశారు.
Are we treating people of Chenchu tribes like our fellow Indians? Please check the video:https://t.co/qTVrGREv1f#savenallamala
— Pawan Kalyan (@PawanKalyan) September 17, 2019
తమ తీర్మానాలు కూడా ప్రభుత్వాలు పాటించాలని.. అడవిలో వున్న ప్రతీ చెట్లు, జంతువులను తాము తమ దేవతలుగా అరాధిస్తామన్నారు. తాము ప్రతీ చెట్టు, జంతవులో కూడా దేవతల్ని కొలుస్తామన్నారు. చెంచు నాయకుడు మాట్లాడిన వీడియోను పోస్టు చేస్తూ... ‘అసలు మనం చెంచు తెగలను తోటి భారతీయులుగా గుర్తిస్తున్నామా? అని జనసేనాని పవన్ కల్యాణ్ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. అసెంబ్లీలో గతంలో జరిగిన చర్చలో వారికి సంబంధించి పలు వ్యాఖ్యలు కోట్ చేశారు.
‘గిరిజనులకు ప్రజాస్వామ్యాన్ని నేర్పించాల్సిన అవసరం లేదు. వాళ్ల నుంచి మనం ప్రజాస్వామ్య విలువలను నేర్చుకోవాలి. ఈ భూమి మీద అత్యంత ప్రజాస్వామ్యయుతమైన వ్యక్తులు వారే’ అని చెప్పిన విషయాన్ని పవన్ ప్రస్తావించారు. అంతేకాకుండా యురేనియం తవ్వకాలతో జరిగి అనర్థాలపై రచించిన అణుధార్మి సత్యలు అనే పుస్తకాన్ని కూడా అఖిలపక్షం సమావేశంలో విడుదల చేశారు. యురేనియం తవ్వకాల వల్లే జరిగే నష్టాలు ఏంటో తెలుసుకోవాలంటే ఈ పుస్తకం తప్పకుండా చదవాలని పవన్ కల్యాణ్ కోరారు.
A book was released at the all Party meet yesterday ;to make people understand the gravity of the situation in Nallamala’ by the activists of ‘Movement Against Uranium Project’. Anyone interested to understand the implications of the uranium mining in Nallamala forest.
— Pawan Kalyan (@PawanKalyan) September 17, 2019
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more