మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య చేసుకున్న ఘటనపై స్పందించిన మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు ఆయనది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని అన్నారు. కోడెలపై నమోదైన కేసులపై స్పందిస్తూ చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. కోడెల మృతదేహానికి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో నివాళులర్పించిన ఆయన... పలు అంశాలపై మీడియాతో మాట్లాడారు. కోడెల ఆత్మహత్యపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు,
కోడెల ఆత్మహత్య ఘటనపై సీబిఐ దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. పోలీసులపై రాష్ట్రప్రభుత్వ పెద్దల జోక్యం ఎంతలా వుందో ఈ ఘటనతో బహిర్గతం అవుతోందని అన్నారు. వైసీపీ ప్రభుత్వం ఉన్మాదిలా వెంబడించి కోడెల ఉసురు తీసిందని చంద్రాబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రమంతా భయభ్రాంతులకు గురిచేయడానికే.. ప్రజావేదికను కూల్చేశారన్నారు. తన ఇంటిని కూడా ముంచేందుకు యత్నించారని పేర్కొన్నారు.
మొత్తం తప్పుడు సమాచారాన్ని వైసీపీ నేతలు ప్రచారం చేస్తున్నారన్నారు. ఏ తప్పు చేయని నన్నపనేని, అచ్చెన్నాయుడుపై కేసులు పెట్టించారన్నారు. కుటుంబరావుపై తప్పుడు కేసులు బనాయించారని చంద్రబాబు పేర్కొన్నారు. కోడెలది ప్రభుత్వం చేసిన హత్య అని చంద్రబాబు ఫైర్ అయ్యారు. కోడెల మృతిపై ప్రతి ఇంట్లో, మేధావుల్లో చర్చ జరగాలన్నారు. మరే వ్యక్తికీ కోడెలలాంటి పరిస్థితి రాకూడదన్నారు.
వైసీపీ ప్రభుత్వానికి పోలీసులు.. ఆలిండియా సర్వీస్ ఉద్యోగులు సరెండర్ అయ్యారని ఆయన ఆరోపించారు. తప్పుచేసిన వాడికి శిక్ష వేస్తే నేనూ అభినందించేవాడినన్నారు చంద్రబాబు. కుమారుడు, కూతురు వేధింపుల వల్లే... కోడెల ఆత్మహత్య చేసుకున్నాడని తప్పుడు ప్రచారం చేస్తున్నారని చంద్రబాబు వాపోయారు. శివరాం విదేశాల్లో కాకుండా ఇక్కడే ఉండుంటే... కోడెలను ఆయనే చంపాడని కేసులు పెట్టేవారని చంద్రబాబు పేర్కొన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more