kodela siva prasada rao funeral tomorrow కొడెల శివప్రసాద్ అంత్యక్రియల్లో సందిగ్థత..

Kodela siva prasada rao last rites to be conducted tomorrow

kodela siva prasad, last rites, funeral, sattenapalli, sivaram, kodela suicide attempt, kodela shiva prasad suicide attempt, kodela suicide, Vendetta politics, YSR Congress Party, Y. S. Rajasekhara Reddy, Telugu Desam Party, Nara Lokesh, Chandrababu, Guntur, Vijayawada, Andhra Pradesh, Politics

Andhra Pradesh former speaker Kodela Siva Prasada Rao's last rites to be held tomorrow after his son sivaram arrives from foreign. who had declared dead after suicide attempt today,

కొడెల శివప్రసాద్ అంత్యక్రియల్లో సందిగ్థత..

Posted: 09/16/2019 08:11 PM IST
Kodela siva prasada rao last rites to be conducted tomorrow

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు కుమారుడు శివరాం తన తండ్రి మరణవార్త తెలుసుకుని గుంటూరుకు తిరుగుప్రయాణమయ్యారు. రేపటిలోగా ఆయన గుంటూరుకు చేరుకుంటారని మాజీ మంత్రి, టీడీపి నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. శివరాం ఇంటికి చేరుకున్న అనంతరం మంగళవారం లేదా బుధవారం గుంటూరు జిల్లాలోని నరసారావుపేటలో కోడెల శివప్రసాద్ రావు పార్థివదేహానికి అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు ఆయన కుటుంబసభ్యులు తెలిపారు.

దీంతో అంత్యక్రియలు ఎప్పుడు నిర్వహిస్తారనే విషయంలో మాత్రం సందిగ్ధత కొనసాగుతున్నట్టే తెలుస్తోంది. కోడెల శివప్రసాదరావు మరణంతో ఆయన సతీమణి శశికళ కుప్పకూలారు. కోడెల మృతితో షాక్‌లోకి వెళ్లిందని.. ఈ క్రమంలోనే శశికళ ఆరోగ్యం క్షీణించిననట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సమాచారం అందుకున్న వైద్యులు కోడెల ఇంటికి వెళ్లి శశికళకు వైద్య చికిత్స అందిస్తున్నారు.

కోడెల శివప్రసాద రావు పార్థివదేహానికి పోస్టుమార్టం ముగిసిన తర్వాత ఆయన పార్థివదేహాన్ని టీడీపి అధినేత చంద్రబాబు సూచనల మేరకు ఉస్మానియా ఆసుపత్రి నుంచి నేరుగా ఎల్వి ప్రసాద్ చౌరస్తాలోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌కి తరలించారు. ఆంధ్రప్రదేశ్  టీడిపి నేతలు, కార్యకర్తలు, కోడెల శివప్రసాద్ రావు అభిమానులకు సందర్శనార్థం ఈ రాత్రికి ఆయన పార్థివదేహాన్ని అక్కడే ఉంచి రేపు మంగళవారం ఉదయం గంటూరుకు తరలించనున్నారు.

కోడెల మృతితో ఇప్పటికే కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఆయన కూతురు విజయలక్ష్మిని గుండెలవిసేలా రోదిస్తోంది. తన తండ్రి కన్నుమూతపై వదంతులు వ్యాప్తి చేయొద్దంటూ కోరారు. హైదరాబాద్ లోని వారి ఇంటి ఆవరణలో మీడియాతో మాట్లాడారామె. “మా నాన్న అంటే మాకు ప్రాణం. మా మధ్య ఎలాంటి గొడవలు లేవు. కూతురు, కొడుకు, భార్య వల్లే ఆయన చనిపోయారంటూ రకరకాల ప్రచారాలు చేస్తున్నారని’’ అమె అవేదన వ్యక్తం చేశారు.

‘‘అవన్నీ నిజం కావు. వెళ్లిపోయిన మనిషి గురించి చెడు ప్రచారం చేయొద్దు. ప్రభుత్వం మారినప్పటినుంచి .. తప్పుడు కేసులతో పెద్దాయకు కంటిమీద కునుకులేదు. నరకం అనుభవించారు. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన ఒత్తిడి వల్లే ఆయన అశాంతికి లోనయ్యారు. తండ్రిచాటు పిల్లల్లాగా పెంచారు మమ్మల్ని. మామీద అభాండాలు చేయొద్దు. ఆయన వయసుకు, సీనియారిటీకైనా రెస్పెక్ట్ ఇవ్వండి. మంచి మాట ప్రచారం చేయండి. మా బ్రతుకు మమ్మల్ని బ్రతకనివ్వండి” అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారామె.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kodela siva prasad  last rites  funeral  sattenapalli  shivaram  TDP. YSRCP  Andhra Pradesh  Politics  

Other Articles