తమిళనాడులోని చెన్నైలో మహిళా పారిశ్రామికవేత్త ఆత్మహత్య చేసుకోవడం వ్యాపార వర్గాల్లో కలకలం రేపింది. లాన్సన్ టయోటా కార్ల డీలర్షిప్ యజమాని అయిన రీటా లంకలింగ(50) బుధవారం రాత్రి సమయంలో బలవన్మరణానికి పాల్పడ్డారు. చెన్నైలోని నుంగంబాక్కం కోథారీ రోడ్డులోని భారీ భవంతిలో లంకలింగం, రీటా దంపతులు నివాసముంటున్నారు. లంకలింగం లాన్సన్ అనే సంస్థను ఏర్పాటుచేసి తమిళనాడు వ్యాప్తంగా టయోటా కార్లకు డీలర్గా వ్యవహరిస్తున్నారు.
ఆ సంస్థకు ఆయనే ఛైర్మన్గా ఉండగా.. భార్య రీటా జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. రీటా రోజూ ఉదయం 8 గంటలకే ఇంటి నుంచి ఆఫీసుకు వెళ్తుంటారు. అయితే గురువారం 11 గంటలైనా రీటా గదిలో నుంచి బయటకు రాకపోవడంతో పనిమినిషి తలుపు తట్టింది. లోపలి నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో వెంటనే నుంగంబాక్కం పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని తలుపు పగులగొట్టి చూడగా రీటా ఫ్యాన్కు వేలాడుతూ కనిపించారు.
పోలీసులు ఆమె మృతదేహాన్ని దించి కీల్పాక్ మెడికల్ కాలేజ్కి తరలించారు. రీటా ఆత్మహత్యపై పోలీసులు అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఆర్థిక మాంద్యం కారణంగా దేశవ్యాప్తంగా కార్ల అమ్మకాలు పడిపోవడంతో ఈ ఎఫెక్ట్ వారి వ్యాపారంపై పడిందని, ఆ మనోవేదనతోనే ఆమె ప్రాణం తీసుకున్నట్లు తెలుస్తోంది. రెండు మూడు రోజులుగా రీటా మనస్తాపంగా ఉంటున్నారని, ఎవరితోనూ సరిగ్గా మాట్లాడటం లేదని సన్నిహితులు చెబుతున్నారు.
కార్ల అమ్మకాలు పడిపోవడంతో ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నారని, అందువల్లే ఆమె ఆత్మహత్యకు పాల్పడ్డారన్న వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు రీటాకు భర్తతో ఏమైనా విభేదాలున్నాయా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రీటా ఆత్మహత్యకు ఆర్థిక మాంద్యమే కారణమన్న వాదనలు ఎక్కువగా వినిపించడంతో వ్యాపార వర్గాలు కలవరపడుతున్నాయి. రానున్న రోజుల్లో పరిస్థితి ఎంతగా దిగజారుతుందోనని పారిశ్రామికవేత్తలు ఆందోళన చెందుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more