మోటార్ వాహనాల చట్టానికి సవరణలు చేసిన కొత్త చట్టాన్ని అమల్లోకి తీసుకువచ్చి.. వాహనదారులపై భారీ జరిమానాలు విధించడంపై షోషల్ మీడియా వేదికగా అనేక విమర్శలు వెల్లివిరయడంతో ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం దిగివచ్చింది. ఈ విషయమై కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. పెంచిన ట్రాఫిక్ జరిమానాల విధింపుపై రాష్ట్రాలే సొంతంగా నిర్ణయాలు తీసుకోవచ్చని స్పష్టంచేశారు. దీంతో జరిమానాల విధింపు రాష్ట్రప్రభుత్వాల నిర్ణయంపై వుండటంతో అన్ని రాష్ట్రాలు దీనిని వ్యతిరేకిస్తున్నాయని సమాచారం.
దేశవ్యాప్తంగా పెరిగిన ట్రాఫిక్ జరిమానాలను గుజరాత్ ప్రభుత్వం మంగళవారం తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవల సవరించిన మోటారు వాహనాల చట్టం-2019 ప్రకారం పెరిగిన ట్రాఫిక్ జరిమానాలను రాష్ట్ర ప్రభుత్వాలు తగ్గించుకొనే వెసులుబాటు ఉంటుందని వెల్లడించారు. 21వ శతాబ్దపు యువత (మిలీనియల్స్) ఎక్కువగా క్యాబ్ లపై ఆసక్తి కనబరుస్తుండడంతోనే కార్ల అమ్మకాలు తగ్గిపోయాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలపై చేశారు.
దీనిపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు తావివ్వడంతో దీనిపైనా ఆయన వివరణ ఇచ్చారు. నిర్మల చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని, వాహన అమ్మకాలు పడిపోయేందుకు ఇది కూడా ఒక కారణమని వివరించారు. బీఎస్-6 ప్రమాణాలతో హోండా యాక్టివా 125 స్కూటర్ ఆవిష్కరణ సందర్భంగా ఆయన దీనిపై స్పందించారు. ప్రతి నెలా దిగజారుతున్న వాహన అమ్మకాలకు పలు కారణాలు ఉన్నాయని అన్నారు.
విపణిలోకి ఈ-రిక్షాల అరంగేట్రంతో సంప్రదాయ ఇంధన వాహనాల అమ్మకాలు పడిపోవడం, దేశ వ్యాప్తంగా ప్రజా రవాణా మెరుగుపడడం వంటి కారణాల వల్ల వాహన రంగం కష్టాల్లో ఉందని వివరించారు.‘‘వాహనాలపై ప్రస్తుతం ఉన్న జీఎస్టీని పది శాతం తగ్గించాలని, దీనివల్ల తమకు తాత్కాలిక ఊరట లభిస్తుందని ఆటోమొబైల్ రంగం కోరుతోంది. కానీ ఇది జీఎస్టీ మండలి పరిధిలోని అంశం. దీనిపై నేను ఆర్థికశాఖను సంప్రదించాను. ఇది వారి చేతుల్లోనే ఉంది’’ అని అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more