పోలీసులకు నిందితులను అదుపులోకి తీసుకుని వారిని న్యాయస్థానంలో హాజరుపర్చాల్సిన బాధ్యత వున్నా.. దానిని అధిగమించి వారు పరారీలో వున్న నిందితుల అచూకీ కనుక్కునే సమయంలో నిందితుల సంబంధికులపై చేయి చేసుకోవడం, వారిని అకారణంగా ఠాణాలకు తీసుకెళ్లి నిర్భందంలో వుంచడం వంటి చర్యలు చేస్తారన్న అరోపణలు వున్నాయి. ఇలాంటి ఘటనలు ఏ కిందిస్థాయి అధికారులో చేశారంటే వారికి ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి తీవ్రంగా వుందని భావించవచ్చు.
కానీ ఓ జిల్లాస్థాయి అధికారినే ఇలాంటి దారుణాలకు పాల్పడితే.. తానే చట్టమన్నట్లు వ్యవహరిస్తే.. అది పరాకాష్టే. ఇక ఒడిషాలో అలాంటి ఘటనే జరిగింది. ఓ రోడ్డు ప్రమాదం కేసులో నిందితుడైన వ్యక్తి ఆచూకీ చెప్పాలంటూ జిల్లా ఎస్పీ విచక్షణ రహితంగా వ్యవహరించారు. నిందితుడి భార్యను గర్భిణి అని కూడా చూడకుండా అమె పోట్టపై బూటు కాలితో తన్నింది. తాను ఓ మహిళగా వుంటూ.. మరో మహిళ గర్భంపై తన్న కూడదన్న ఇంకితాన్ని మర్చి.. అమెను మాతృత్వానికి దూరం చేసేలా ఎస్సీ దారుణంగా వ్యవహరించింది. దీంతో మహిళ గర్భవిచ్ఛిత్తి జరగడంతో బాధితురాలు విలవిల్లాడిపోయింది.
ఒడిశాలోని సుందర్ గఢ్ జిల్లాలో జరిగిన ఈ ఘటనపై స్థానిక న్యాయస్థానం తీవ్రంగా స్పందించింది. మహిళా ఎస్పీ గర్భిణీని బూటు కాలితో తన్నడంపై తీవ్ర అగ్రహాన్ని వ్యక్తం చేసింది. బాధిత మహిళ గర్భవిచ్ఛిత్తి జరగడానికి కారణమైన ఎస్పీపై కేసు నమోదు చేయాలని అదేశించింది. జిల్లా ఎస్సీ సౌమ్య మిశ్రాపై హెమగిర్ పోలీసులు కేసు నమోదు చేయాలని అదేశించింది. ఈ కేసు విచారణను అమె సబ్ అర్డినేట్ అయిన ఢిప్యూటీ ఎస్పీ జ్యోత్సమయికి అప్పగించింది. అయితే దర్యాప్తు సాగే విధానంపైనే అనుమానాలు వున్నాయి.
అస్సలేం జరిగిందంటే.. గత నెల మూడో తేదీన సుందర్ గఢ్ జిల్లాలోని కణిక గ్రామంలో కారు ఢీకొని ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనకు కారణమైన నిందితులను అరెస్ట్ చేయాలంటూ గ్రామస్థులు పోలీస్ స్టేషన్ను ముట్టడించి ఆందోళనకు దిగి విధ్వంసం సృష్టించారు. దీంతో స్పందించిన మహిళా ఎస్పీ సౌమ్య మిశ్రా స్వయంగా కేసు పర్యవేక్షణ చేపట్టారు. నిందితుల్లో బాధితురాలు ప్రియాడే, అమె భర్త ఉత్తమ్ డే కూడా ఉన్నాడు. దీంతో ఆమెను అదుపులోకి తీసుకున్న ఎస్పీ.. భర్త ఆచూకీ చెప్పాలంటూ విచక్షణ రహితంగా కొట్టారు. అక్కడితో ఆగక గర్భిణి అయిన ఆమె పొట్టపై బూటుకాలితో బలంగా తన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more