YS Jagan Terrorizing Business : Mohandas Pai వైసీపీ ప్రభుత్వంపై పారిశ్రామికవేత్త సంచలన వ్యాఖ్యలు

Karnataka industrialist mohandas pai sensational tweet on ys jagan govt

Mohandas Pai, Padma Shri, YS Jagan, Manipal Global Education, Businessman, Industrialist, Andhra Pradesh

Mohandas Pai, is the former director of Infosys and Head - Administration, Education and Research, Financial, Human Resources of Infosys Leadership Institute. He is the current Chairman of Manipal Global Education.

వైసీపీ ప్రభుత్వంపై పారిశ్రామికవేత్త సంచలన వ్యాఖ్యలు

Posted: 08/17/2019 09:17 PM IST
Karnataka industrialist mohandas pai sensational tweet on ys jagan govt

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై ప్రభుత్వం అధికారాన్ని చేపట్టి ఇంకా పట్టుమని ఆరు మాసాలు కూడా గడవకముందే.. పలు వర్గాల నుంచి విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇప్పటికే బీజేపి, టీడీపీకి చెందిన పలువురు రాజకీయ నేతలు వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్న క్రమంలో తాజాగా ప్రముఖ పారిశ్రామికవేత్త, అక్షయ పాత్ర సహ వ్యవస్థాపకుడు మోహన్‌దాస్ పాయ్ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్ర భవిష్యత్తును జగన్ నాశనం చేస్తున్నారంటూ ట్విట్టర్‌లో విరుచుకుపడ్డారు. జగన్ ప్రభుత్వ ఉగ్రవాదంతో రాష్ట్ర భవిష్యత్ నాశనం అవుతోందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని అమరావతి నిర్మాణ పనుల నిలిపివేత, విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు పునఃసమీక్ష వంటివాటిపై పాయ్ తీవ్ర విమర్శలు చేశారు. ఒప్పందాల పునఃసమీక్షపై జపాన్ ప్రభుత్వం రాసిన లేఖపై ప్రచురితమైన వార్తలను ఆయన తన ట్వీట్‌కు జోడించారు.  

పెట్టుబడిదారుల విశ్వాసాన్ని దెబ్బతీసేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఒప్పందాలను తిరగదోడి బెదిరిస్తుంటే ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఒక్కరు కూడా ముందుకు రారని ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతిలో సింగపూర్ భారీగా పెట్టుబడులు పెట్టిందని, కానీ ఆ ఒప్పందాన్ని తిరగదోడడం వల్ల ఇకపై పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ముందుకు రారన్నారు. తన ట్వీట్లను ఆయన నేరుగా జగన్‌కే ట్యాగ్ చేయడం విశేషం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles