టీడీపీ సీనియర్ నేత, ఏపీ సాగునీటి శాఖ మంత్రి దేవినేని ఉమ రాష్ట్ర ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. కృష్ణా నదికి ఎగువ నుంచి వచ్చిన వరద నీటితో అమరావతి పరిసతర ప్రాంతాల్లో అనేక గ్రామాలు జలమయమయ్యాయని.. అందుకు కారణం మానవుడు సృష్టించిన వరదే కారణమని అరోపించారు. ప్రభుత్వ కనుసన్నల్లో ఈ కృతిమ వరద సృష్టీకరణ జరిగిందని ఆయన విమర్శించారు. ఉండవల్లిలోని చంద్రబాబు ఇంటిని ముంచేందుకే ప్రభుత్వం వరదను నియంత్రిస్తోందని ఆయన మండిపడ్డారు.
ఒక ప్రణాళిక లేకుండా కృష్ణా నీటిని విడుదల చేశారని దేవినేని ఉమ ధ్వజమెత్తారు. కర్ణాటక నుంచి పెద్ద ఎత్తున వరద వస్తోందని తెలిసినా... శ్రీశైలం నిండే వరకు చూశారని ఉమ ఆరోపించారు. శ్రీశైలం దగ్గర కావాలనే నీటిని నిలిపి కావాలనే వరదను అమరావతికి తీసుకొచ్చారని తీవ్ర ఆరోపణలు చేశారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ నీటిని ముందుగానే విడుదల చేసి ఉంటే పరిస్థితి ఈ రకంగా ఉండేది కాదని వ్యాఖ్యానించారు. రాజధాని భూములు మునిగేలా చేసి... రాజధానిని ఇడుపులపాయకు తీసుకెళ్లాలని సీఎం జగన్ కుట్ర చేస్తున్నారని దేవినేని ఉమ మండిపడ్డారు.
శ్రీశైలం నుంచి సోమశిల వరకు నీరు తీసుకెళ్లి ఉంటే ఆయా ప్రాంతాలకు కూడా నీరు వచ్చేదని అన్నారు. కేవలం చంద్రబాబు ఇల్లు మునిగేందుకు వైసీపీ ప్రభుత్వం ఈ రకంగా వ్యవహరించిందని అన్నారు. టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గంలోని ప్రాంతాలను కూడా ముంచేశారని ఆరోపించారు. వరదపై ముఖ్యమంత్రి, సాగునీటి శాఖ మంత్రి రివ్యూ చేయలేదని... మంగళగిరి ఎమ్మెల్యే వరదపై ఎలా రివ్యూ చేస్తారని దేవినేని ఉమ ప్రశ్నించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more