టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నివాసం వద్ద ఇవాళ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కృష్ణా నదికి వరద ఉద్ధృతి నేపథ్యంలో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు చంద్రబాబు నివాసంపైకి డ్రోన్ ను ప్రయోగించారు. ఈ విషయాన్ని గుర్తించిన టీడీపీ కార్యకర్తలు వారిని అదుపులోకి తీసుకున్నారు. కొద్దిసేపటికే అక్కడికి చేరుకున్న పోలీసులు సదరు వ్యక్తులను అదుపులోకి తీసుకుంటున్నట్లు చెప్పారు. తాము జలవనరుల శాఖ అధికారులమని సదరు వ్యక్తులు చెబుతున్నారు.
కాగా సదరు వ్యక్తులు చెప్పిన విషయాలను నిజమని నిర్థారించేందుకు వారి వద్ద ఎలాంటి ఆధారాలు లేవు. దీంతో ఈ విషయం తెలుసుకున్న టీడీపీ నేత దేవినేని అవినాష్, టీడీ జనార్ధన్ తో పాటు టీడీపీ కార్యకర్తలు భారీ సంఖ్యలో అక్కడికి వచ్చేశారు. వీరిని పోలీసులు చంద్రబాబు ఇంటి లోనికి అనుమతించలేదు. దీంతో పోలీసులు వాస్తవాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడే పోలీస్ జీపు ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు.
నా భద్రతనే ప్రశ్నార్థకంగా మారుస్తారా?: చంద్రబాబు
ఉండవల్లిలోని తన నివాసంపైకి కొందరు డ్రోన్లు ఎగరవేయడంపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతల ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్న చంద్రబాబు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ తో పాటు గుంటూరు జిల్లా సూపరింటెండెంట్(ఎస్పీ)తో ఫోన్ లో మాట్లాడారు. హైసెక్యూరిటీ జోన్ లో డ్రోన్లు ఎలా ఎగరవేస్తున్నారని ప్రశ్నించారు. డ్రోన్లు ప్రయోగించింది ఎవరు? అందుకు అనుమతులు ఎవరు ఇచ్చారు? అని నిలదీశారు.
‘డీజీపీ, రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండా ఇలాంటి హై సెక్యూరిటీ ప్రదేశాల్లో డ్రోన్లు ఎగరవేయడానికి వీల్లేదు. అసలు అన్ని అనుమతులతోనే డ్రోన్లను ప్రయోగించారా? నేను ఉండే నివాసంపై డ్రోన్లతో నిఘా పెట్టిందెవరు?. చివరికి నా భద్రతనే ప్రశ్నార్థకంగా మారుస్తారా? ఆ డ్రోన్లను ప్రయోగించిన వ్యక్తులు ఎవరు? ఆ డ్రోన్లలో ఏముందో, పట్టుబడిన వ్యక్తులు ఎవరో ప్రభుత్వం వెంటనే బయటపెట్టాలి. నిఘా వేసింది ఎవరో, దీని వెనుక కుట్ర ఏముందో తెలియజేయాలి’ అని చంద్రబాబు డిమాండ్ చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more