కేంద్రీయ మాధ్యమిక విద్యా బోర్డు(సీబీఎస్ఈ) విద్యార్థులకు పెద్ద పెద్ద షాకిచ్చింది. విద్యార్థుల పరీక్ష ఫీజులను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇక దీంతో పాటు దేశంలోని అణగారిన వర్గాలుగా వున్న ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు కర్రు కాల్చి వాతపెట్టింది. ఇన్నాళ్లు నామమాత్రంగా వున్న ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల ఫీజులను భారీగా పెంచుతూ మోత మోగించింది. ఇక తమ ఫీజుల పెంపు దేశవ్యాప్తంగా సంచలనం కాగా, దీనిని సీబీఎస్ఈ సమర్థించుకోవడం కొసమెరుపు.
ఇప్పటి వరకు సీబీఎస్ఈ 10, 12 తరగతి పరీక్షలకు హాజరయ్యే ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు అయిదు సబ్జెక్టులకు రూ.50 రుసుము చెల్లిస్తుండగా.. ఆ మొత్తాన్ని ఏకంగా 24 రెట్లు పెంచి రూ.1200 గా నిర్ణయించింది. ఇప్పటి వరకు 12 తరగతిలో ఏదైనా అదనపు సబ్జెక్ట్ పరీక్షకు హాజరయ్యే ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఎలాంటి ఫీజు ఉండేది కాదు. అయితే ఇకనుంచి ప్రతి అదనపు సబ్జెక్ట్కు రూ.300 చొప్పున ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
మరోవైపు జనరల్, ఇతర విభాగాలకు చెందిన విద్యార్థుల ఫీజులను కూడా సీబీఎస్ఈ రెట్టింపు చేసింది. తాజాగా పెరిగిన ఫీజుల ప్రకారం రూ.750 చెల్లించాల్సిన జనరల్ విద్యార్థులు రూ.1500 చెల్లించాల్సి ఉంటుంది. విదేశాల్లోని సీబీఎస్ఈ పాఠశాలల్లో 10, 12 తరగతుల పరీక్షలకు దరఖాస్తుల చేసుకునే విద్యార్థులు ఐదు సబ్జెక్టులకు కలిపి ఇప్పటివరకు రూ.5,000 చెల్లించేవారు.
అయితే ఈ మొత్తాన్ని ఏకంగా రూ.10,000కు పెంచింది. మైగ్రేషన్ విద్యార్థుల పరీక్ష ఫీజును కూడా రూ.150 నుంచి రూ.350 కి పెంచింది. 12వ తరగతిలో ప్రతి అదనపు సబ్జెక్టుకు జనరల్ విద్యార్థులు రూ.300 (గతంలో రూ.150), విదేశాల్లోని విద్యార్థులు రూ.2000 (గతంలో రూ.1000) చెల్లించాల్సి ఉంటుంది. పరీక్షా పీజుల వ్యవహారం పెను సంచలనం కాగా, దానిని సీబీఎస్ఈ సమర్థించుకుంది. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ఫీజులు పెంచక తప్పదని కూడా తేల్చిచెప్పింది.
ఫీజుల పెంపు వివరాలు..
విభాగం (కేటగిరీ) గతంలో ఫీజు పెరిగిన ఫీజు
ఎస్సీ, ఎస్టీ రూ.50 రూ. 1,200
జనరల్ రూ.750 రూ. 1,500
మైగ్రేషన్ రూ.150 రూ.350
విదేశాల్లోని పాఠశాలలు రూ.5,000 రూ.10,000
12వ తరగతిలో ప్రతి అదనపు సబ్జెక్టుకు..
విభాగం గతంలో ఫీజు పెరిగిన ఫీజు
ఎస్సీ, ఎస్టీ ఎలాంటి ఫీజు లేదు రూ.300
జనరల్ రూ.150 రూ.300
విదేశాల్లోని స్కూళ్లు రూ.1,000 రూ.2,000
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more