Low pressure in Bay of Bengal to bring rains మరో మూడు రోజులల పాటు రాష్ట్రంలో వర్షాలు..

Low pressure in bay of bengal to bring rains in telangana

Bay of Bengal, Telangana, Telangana weather, Telangana rains, Rains in GHMC, Rains in Hyderabad, Rains in Telangana, Rain Forecast, weather conditions in Hyderabad

A low-pressure area is likely to form under the influence of cyclonic circulation over the north-west Bay of Bengal during the next 2-3 days, which will prove useful for sustaining the active monsoon over the state, informed the IMD.

మరో మూడు రోజులల పాటు రాష్ట్రంలో వర్షాలు..

Posted: 08/05/2019 10:25 AM IST
Low pressure in bay of bengal to bring rains in telangana

తెలంగాణ రాష్ట్రంలో సాధారణ స్థాయి వర్షపాతం కూడా నమోదు కాలేదన్న రైతన్నల అందోళనకు గతవారం రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు తీర్చాయి. ఒడిశా ఉత్తర ప్రాంతం నుంచి జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ వరకు 7.6 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీంతో పాటు రాజస్థాన్‌ దక్షిణ ప్రాంతం నుంచి మధ్యప్రదేశ్‌, ఛత్తీస్ గఢ్‌ మీదుగా ఒడిశా వరకు ఉపరితల ద్రోణి ఉంది. ఈ ప్రభావంతో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి.

ఫలితంగా తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. చాలాచోట్ల అతి భారీ వర్షాలు పడుతున్నాయి. నేడు, రేపు కూడా వర్షాలు ఇలానే కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల భద్రాద్రి విద్యుత్ కేంద్రం (బీటీపీఎస్) నిర్మాణ పనులు ఆగిపోయాయి. నాలుగు రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.

ఇక అటు అంధ్రప్రదేశ్ లోని గోదావరి నది కూడా ఉగ్రరూపం దాల్చింది. సఖినేటి పల్లి నుంచి నరసాపురం వరకూ గోదావర ఉద్దృతి కొనసాగుతుండటంత ఆయా ప్రాంతాల మధ్య నిత్యమూ తిరిగే పంట్లు, లాంచీలు ఇప్పుడు ఆగిపోయాయి. అంతర్వేది క్షేత్రానికి వచ్చే పర్యాటకులతో పాటు మలికిపురం, లక్కవరం తదితర ప్రాంతాలకు వచ్చే వారంతా నదిని దాటే వస్తారు. నరసాపురం నుంచి సఖినేటి పల్లి రేవుకు అర కిలోమీటర్ దూరం కూడా ఉండదు. కార్లు, జీపులు, లారీలు, ద్విచక్రవాహనాలు సహా ప్రజలంతా పంట్ల మీద ప్రయాణిస్తూ నదిని సులువుగా దాటేస్తుంటారు.

కానీ, ఇప్పుడు నది ఉద్ధృతంగా ఉండటంతో, అటు నుంచి ఇటువైపుకు, ఇటు నుంచి అటువైపుకు పంట్ల, చిన్న పడవలను అధికారులు నిలిపివేశారు. దీంతో ఇటువైపువారు ఎవరు నరసాపురం వెళ్లాలన్నా, సుమారు 30 కిలోమీటర్లు ప్రయాణించి వెళ్లాల్సిందే. ఈ ప్రాంతంలో ఓ వంతెన కావాలని తాము సుదీర్ఘకాలంగా కోరుతున్నా, ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని, ఆ కారణంగానే ఈ పరిస్థితిని నిత్యమూ తాము ఎదుర్కోవాల్సి వస్తోందని ఈ ప్రాంతం ప్రజలు వాపోతున్నారు.

శ్రీశైలం జలాశయానికి వరద స్థిరంగా కొనసాగుతుండటంతో, నది మధ్యలో ఉన్న సంగమేశ్వరాలయం క్రమంగా నీట మునుగుతోంది. నిన్న సాయంత్రానికి జలాశయంలో 100 టీఎంసీల నీరుచేరుకోగా, నీటి మట్టం 858 అడుగులు దాటింది. ఎగువ జూరాల గేట్ల నుంచి 1,97,669 క్యూసెక్కులు, విద్యుత్ ఉత్పత్తి ద్వారా మరో 30,293 క్యూసెక్కుల నీరు కలిపి మొత్తం 2,27,962 క్యూసెక్కుల నీరు శ్రీశైలానికి వస్తోంది. కర్ణాటక ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తూనే ఉండటంతో ఇదే వరద మరో నాలుగైదు రోజులు రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. మరో 50 టీఎంసీలకు పైగా నీరు చేరే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని, మరింతకాలం వర్షాలు పడితే, నీరు నాగార్జునసాగర్ కు కూడా విడుదల చేయవచ్చని తెలిపారు.

కాగా, శ్రీశైలానికి వస్తున్న నీటితో సంగమేశ్వరాలయం పూర్తిగా మునిగి, పై గోపురం మాత్రమే దర్శనమిస్తోంది. దీంతో ఆలయ పురోహితులు, ఆదివారం ఆలయ శిఖరంపై ప్రత్యేక పూజలు నిర్వహించి సంగమేశ్వరుడికి వీడ్కోలు పలికారు. జలాశయంలో నీటిమట్టం మరో రెండు అడుగులు పెరిగి 860 అడుగులకు చేరితే, ఆలయం పూర్తిగా నీటమునుగుతుంది. ప్రతి సంవత్సరం మాదిరిగానే, ఆలయం మునిగే వేళ, పిల్లి, సర్పం, శునకం కనిపించాయని, వాటిని కాపాడి, ఎగువన ఉన్న పుష్కర ఘాట్ వద్ద వదిలి పెట్టామని ఆలయ పురోహితులు వెల్లడించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bay of Bengal  Telangana  Telangana rains  Rains in GHMC  Rains in Hyderabad  Rain Forecast  

Other Articles