దేశం శాస్త్రసాంకేతిక రంగాల్లో ప్రపంచాన్నే శాసించే స్థాయికి ఎదుగుతున్నా.. చంద్రుడిపైకి ఉపగ్రహాన్ని పంపుతున్నా.. ఇది కేవలం నగరాలతో పాటు పట్టణాలు, గ్రామీణ విద్యావంతులను మరింత చైతన్యవంతుల్ని చేస్తున్నా.. మారుమూల గ్రామాల్లో జరుగుతున్న అనాగరిక అకృత్యాలకు, హత్యలకు మాత్రం ఇప్పటికీ తెరపడటం లేదు. దేశంలో ఏదో ఒక ప్రాంతంలో నరబలి వార్తలు తెరపైకి వస్తూనే వున్నాయి. తాజాగా తమిళనాడులోనూ ఈ వార్తలు పెనుకలకలాన్ని సృష్టించాయి.
15 సంవత్సరాల బాలుడు దారుణంగా హత్య చేయబడి కనిపించగా, ఆ చుట్టుపక్కల గాలించిన పోలీసులకు, చీకట్లో పూజలు చేస్తున్న వృద్ధుడు కనిపించాడు. అతని దగ్గరకు వెళ్లబోగా పరిగెత్తే ప్రయత్నం చేశాడు. పట్టుకుని అతన్ని సోదా చేయగా, పసుపు, కుంకుమ, విభూది, నిమ్మకాయలు, బ్లేడు తదితరాలు కనిపించడంతో, ఈ హత్యను నరబలిగా పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటన తమిళనాడులోని విల్లుపురం జిల్లా ఉళుందూరుపేట సమీపంలోని అయన్కుంజరం గ్రామంలో జరిగింది.
తమిళనాడులోని విల్లుపురం జిల్లావాస్తవ్యులైన కేశవన్, పరాశక్తి లకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉండగా, చిన్న కుమారుడు శివకుమార్ (15) ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. గొర్రెలు మేపేందుకు వెళ్లిన తన అవ్వను వెతుక్కుంటూ ఆదివారం సాయంత్రం వెళ్లిన శివకుమార్ ఆచూకీ తెలియరాకపోగా బాలుడి తల్లి, అన్న, బంధువులు గాలించినా ఫలితం లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు.
ఈ క్రమంలో కుంజరం అడవుల్లో బాలుడి మృతదేహం ఉందన్న విషయం బయటకు రాగా, అక్కడికి వెళ్లిన పోలీసులకు మారుమూల గుట్టలో గొంతు కోసి హత్య చేయబడిన స్థితిలో శివకుమార్ మృతదేహం కనిపించాడు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించిన పోలీసులు, కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నారు. చుట్టుపక్కల తనిఖీలు చేసిన పోలీసులకు.. హత్యకు కారణాలను శోధించే పనిలో పడ్డారు.
కాగా, పోలీసుల అదుపులో ఉన్న 60 ఏళ్ల వృద్ధుడు, తనకు భూ వివాదం ఉందని, అందుకే అడవుల్లో పూజలు చేస్తున్నానని విచారణలో చెప్పాడు. ఈ వివాదం నుంచి బయటపడేందుకే బాలుడిని నరబలి ఇచ్చి ఉండవచ్చన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ఇదే సమయంలో గత వారంలో స్కూల్ క్రికెట్ పోటీలు జరుగగా, శివకుమార్ కు, ఇతర విద్యార్థులకు మధ్య గొడవలు వచ్చాయని కూడా పోలీసులు తెలుసుకుని.. సదరు విద్యార్థులను కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more