కర్ణాటక అసెంబ్లీలో మరోసారి బలనిరూపణ నిర్వహించనున్నారు. నాలుగో పర్యాయం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సీనియర్ బీజేపి నేత యడియూరప్ప శాసనసభలో మరోమారు తన బలం నిరూపించుకోవాల్సి ఉంటుంది. అయితే బీజేపికి 105 మంది ఎమ్మెల్యేల మద్దతు వుండటం.. సభలో ప్రస్తుతం వున్న గణంకాల నేపథ్యంలో కేవలం 104 మంది బలం వుంటే విశ్వాస పరీక్షను నెగ్గే అవకాశాలున్నాయి.
దీంతో సీఎం యడియూరప్ప విశ్వాస పరీక్షలో విజయం సాధిస్తామని ధీమాను వ్యక్తం చేశారు. 100 శాతం మెజారిటీతో విజయాన్ని అందుకుంటామని చెప్పారు. కాగా, విశ్వాస పరీక్ష అనంతరం సభలో ఆర్థిక బిల్లును ఆమోదింపచేసుకోవాల్సి ఉందని, ఆ బిల్లుకు ఆమోదం రాకపోతే ఉద్యోగుల జీతాలకు నిధులు వినిగించుకోలేని పరిస్థితి ఉంటుందని తెలిపారు. ఈ బిల్లును కాంగ్రెస్-జేడీఎస్ సర్కారు రూపొందించింది. అయితే, ఈ బిల్లులో ఎలాంటి మార్పులు లేకుండానే సభలో ప్రవేశపెడతామని యడియూరప్ప వెల్లడించారు.
కర్ఱాటక అసెంబ్లీలో గోడ మీద పిల్లలా వ్యవహరించి రెబల్ గా మారిన 14 మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ రమేశ్ కుమార్ అనర్హత వేటు వేశారు. ఇదివరకే ముగ్గురు ఎమ్మెల్యేలపై వేటు వేసిన ఆయన.. క్రితం రోజున మరో 14 మందిపై వేటు వేయడంతో పాటు రానున్న నాలుగేళ్ల కాలంలో వారు ఎన్నికలలో పోటీచేయడానికి కూడా వీలులేకుండా చేశారు. దీంతో కన్నడ అసెంబ్లీ నుంచి మొత్తం 17 మందిని డిస్ క్వాలిఫై చేసినట్టు అయింది.
ఎమ్మెల్యేల డిస్ క్వాలిఫికేషన్ ను స్వయంగా మీడియా ముందు ప్రకటించిన రమేశ్ కుమార్, స్పీకర్ గా తాను రాజీనామా చేయబోనని స్పష్టం చేశారు. కాగా, స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామాలు చేసిన ప్రజా ప్రతినిధుల రాజీనామాలను ఆమోదించకుండా, వారు తప్పు చేసినట్టు డిస్ క్వాలిఫై చేయడం ఏంటని పలువురు బీజేపీ నేతలు తప్పుబడుతుతున్నారు. కాగా, డిస్ క్వాలిఫై అయిన వారిలో కాంగ్రెస్ నుంచి బస్వరాజు, మునిరత్నం, సోమశేఖర్, సుధాకర్, శివరాం హెబ్బర్, శ్రీమంత పాటిల్, జేడీఎస్ నుంచి గోపాలయ్య, నారాయణ గౌడ, విశ్వనాథ్ తదితరులున్నారు.
కాగా స్పీకర్ నిర్ణయాన్ని మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య స్వాగతించారు. స్పీకర్ నిర్ణయం ప్రజాస్వామ్య విలువలను కాపాడే విధంగా వుందన్నారు. మరోవైపు ఈ వ్యవహారంపై జేడీఎస్ నేత విశ్వనాథ్ మాట్లాడుతూ, తమపై అనర్హత వేటు వేయడం సరికాదని అన్నారు. సభాపతి విధించిన అనర్హత వేటు చట్టవిరుద్ధమని, న్యాయం కోసం తామంతా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని, రేపు పిటిషన్ వేస్తామని చెప్పారు. మొత్తానికి పద్నాల్గుగు నెలల తరువాత మరోమారు అధికార పగ్గాలను అందుకోనున్న యడ్యూరప్పకు ఈ సారైనా నాలుగేళ్ల పాటు అధికారం వుంటుందా.? అన్నది వేచిచూడాల్సిందే.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more