తెలుగు రాష్ట్రాల రాజకీయ పార్టీలు, నేతలు, గత ఐదారేళ్లుగా ఎదురుచూస్తున్న తరుణం త్వరలో రాబోతొంది. అదేంటి ఇటీవలే రెండు తెలుగు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యియి కాదా.? ఇంకా దేనికోసం పార్టీలు నేతల ఎదురుచూపులు అంటారా.? ఇక్కడే అసలు ట్విస్టు వుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు జమ్మూకశ్మీర్, సిక్కిం రాష్ట్ర ప్రజలు కూడా ఒకింత సంబరపడుతున్నారు. ఎందుకంటారా.?
తెలుగు రాష్ట్రాలకు పునర్విభజన బిల్లులో పేర్కోన్న అసెంబ్లీ సీట్ల పెంపునకు సంబంధించిన ఫైలు దుమ్ముదులిపేందుకు కేంద్రం సిద్దమైనట్లు సమాచారం. అంతేకాదు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలతో పాటు సిక్కిం, జమ్మూకాశ్మీర్ రాష్ట్రాల అసెంబ్లీ సీట్ల పెంపుకు సంబంధించి కూడా రంగం సిద్ధమైనట్టు సమాచారం. ఓ వ్యక్తి సమాచార హక్కు చట్టం ద్వారా వివరణ కోరగా.. ఈసీ ఆ వివరాలను వెల్లడించింది. అసెంబ్లీ సీట్ల పెంపుపై ఏప్రిల్లోనే ఈసీకి కేంద్ర ప్రభుత్వం నోట్ పంపింది.
అయితే కేంద్రం పంపిన నోట్ సరిగా లేదంటూ.. సరైన సమాచారంతో మరోసారి పంపాలని హోంశాఖను ఈసీ కోరింది.అసెంబ్లీ సీట్ల పెంపుపై ఇప్పటికే కేంద్ర న్యాయశాఖ, హోంశాఖలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా, తాజాగా పునర్విభజనకు సంబంధించి ఈ నాలుగు రాష్ట్రాల్లో ఒక కమిషన్ను కేంద్రం ఏర్పాటు చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఈ కమిషన్ నివేదిక ఆధారంగా సీట్ల సంఖ్య ఏపీలో 225, తెలంగాణలో 151కి చేరుకోనుంది. వచ్చే పార్లమెంటు సమావేశాల్లోనే ఈ ప్రక్రియను పూర్తి చేసే అవకాశం ఉంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more