judgement reserved on Ravi Prakash Bail Petition రవిప్రకాష్ బెయిల్ పిటీషన్ పై.. రిజర్వులో తీర్పు

Hc reserves judgement on tv 9 ravi prakash bail petition

Ravi Prakash, Shivaji, Telangana High Court, Bail Petirion, data theft, fake shares purchase, national company law tribunal, Forgery Case, Cyberabad Cybercrime Police, Investigation, Evidences, Hyderabad, KCR, Telangana CM, Telangana, politics

The Telangana High Court had reserved the judgement on TV9 former CEO Ravi Prakash Bail petition, after recording both the plaintiff and accused hearings.

రవిప్రకాష్ బెయిల్ పిటీషన్ పై.. రిజర్వులో తీర్పు

Posted: 06/18/2019 02:03 PM IST
Hc reserves judgement on tv 9 ravi prakash bail petition

పోర్జరీ, డాటా చోరి, అధికార దుర్వినియోగం కేసుల్లో అభియోగాలు ఎదుర్కోంటున్న సీనియర్ పాత్రికేయుడు, టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాశ్‌ ముందస్తు బెయిల్ పిటీషన్ పై తెలంగాణ హైకోర్టులో ఇవాళ వాదనలు ముగిసాయి. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పుని రిజర్వ్ లో పెట్టింది. ఇవాళ కోర్టులో రవిప్రకాష్ తరపున వాదనలు వినిపించిన దిల్ జిత్ సింగ్ అహువాల్యా... టీవీ 9 షేర్ల అగ్రిమెంట్ కుట్రపూర్వకంగా జరిగిందన్నారు. షేర్లు కొనుగోలు చేసినప్పుడు మనీ ట్రాన్సక్షన్ అంతా నిబంధనలకు విరుద్ధంగా జరిగిందన్నారు.

కాపీ రైట్స్ ప్రకారం టీవీ 9 లోగో రవిప్రకాష్ కే చెందుతుందని తన వాదనలు బలంగా వినిపించారు. రవిప్రకాష్ 40వేల షేర్లను నటుడు శివాజీకి అమ్మడం వాస్తవమేనని.. ఈ షేర్లకు సంబంధించి అర్థిక వ్యవహారాలు మొత్తం బ్యాంక్ ల ద్వారా జరిగాయన్నారు. లావాదేవీల జరిగినట్టు బ్యాంకుల నుంచి తెచ్చిన స్టేట్ మెంట్లే ఈ విషయాన్ని రూడీ చేస్తాయని అన్నారు. ఇక టీవీ 9 వ్యవహారాలకు సంబంధించి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యూనల్ లో కేసు పెండింగ్ లో ఉందన్నారు. రవిప్రకాష్ పై మూడు కేసులు వెంట వెంటనే నమోదు అయ్యాయన్నారు.

అయితే టీవీ 9 షేర్ల కొనుగోలు నిబంధనల ప్రకారమే జరిగిందని ప్రభుత్వం తరపు న్యాయవాది కోర్టుకి తెలియజేశారు. దీనికి సంబంధించి అగ్రిమెంట్ పేపర్లను కోర్టుకి సమర్పించారు. బ్యాంకుల ద్వారానే మనీ ట్రాన్సాక్షన్ జరిగిందన్నారు. దీనికి సంబంధించిన ఆధారాలు కూడా కోర్టుకి సమర్పించారు. టీవీ 9 లోగో వ్యక్తి ప్రాపర్టీగా ఉండదని, కంపెనీ ప్రాపర్టీగా మాత్రమే ఉంటుందన్నారు. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యూనల్ లో ఎలాంటి కేసు పెండింగ్ లో లేదన్నారు. రవిప్రకాష్, శివాజీలకు సంబంధించిన పిటిషన్ పై నేషనల్ కంపెనీ అప్పియేట్ లా ట్రిబ్యునల్ స్టే ఇచ్చిందని ప్రభుత్వం తరపు లాయర్ కోర్టుకి తెలియజేశారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పుని వాయిదా వేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles