Gautam Sawang takes charge as AP new DGP ‘కాల్ మనీ’ రక్కస్పీపై కొత్త పోలీస్ బాస్ కొరడా..

Gautam sawang takes charge as ap new dgp

Gautam Sawang, New DGP, Mangalagiri, CM YS Jagan, YS JaganMohan Reddy, AP Government, Call Money case, Andhra Pradesh, Crime, politics

IPS officer Gautam Sawang has been appointed as fifth DGP of Navya Andhra Pradesh. He has taken the charge at DGP office in Mangalagiri on Saturday.

‘కాల్ మనీ’ రక్కస్పీపై కొత్త పోలీస్ బాస్ కొరడా..

Posted: 06/01/2019 03:14 PM IST
Gautam sawang takes charge as ap new dgp

ఆంధ్రప్రదేశ్‌ నూతన పోలీస్‌ బాస్ (డీజీపీ)గా గౌతం సవాంగ్‌ బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర విభజన అనంతరం నవ్యాంధ్రలో బాధ్యతలు స్వీకరించిన ఐదో అధికారి ఆయన. మంగళగిరిలోని డీజీపీ కార్యాలయానికి విచ్చేసిన గౌతం సవాంగ్‌ తొలుత పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం కార్యాలయంలోకి అడుగుపెట్టి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు పోలీసు అధికారులు సవాంగ్‌ను అభినందించారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తనపై గురుతరమైన బాధ్యత ఉంచిందని, దానిని చిత్తశుద్ధితో నిర్వహిస్తానని అన్నారు.

ఏపీ పోలీసులకు దేశంలోనే మంచి గుర్తింపు ఉందని, అటువంటి శాఖకు డీజీపీగా రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా డీజీపీకి పలు సూచనలు చేశారు. ప్రజలు కోరుకునే విధంగా ప్రభుత్వం తరుపున పోలీసులు పనిచేయాలని అందుకు తగ్గట్లుగా పోలీసులు వ్యవహరించాలని ఆయన అన్నారు. సంక్షేమం దిశగా ముఖ్యమంత్రి అడుగులు వేస్తున్నారని, శాంతిభధ్రతల విషయంలో కాంప్రమైజ్ కాకూడదని సీఎం ఇప్పటికే తనకు చెప్పినట్లు సవాంగ్ తెలిపారు.

ఈ విషయంలో మీడియా, ప్రజలు సాకారం తనకు ఉండాలని కోరిన ఆయన అదే సమయంలో గత ప్రభుత్వ హయాంలో వెలుగుచూసిన కాల్ మనీ కేసులో అసలు జరిగిందేమిటీ.? ఈ కేసులో అసలు నిందితులు ఎవరన్న విషయం కూడా దర్యాప్తులో తేలిపోతుందని అన్నారు. అయితే ఈ కేసులో చాలా లిటిగేషన్స్ వున్నాయన్న ఆయన.. ఎన్ని అవరోధాలు వున్నా వాటిన్నింటినీ చేధించి ప్రజలకు, బాధితులకు అండగా నిలుస్తామని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Gautam Sawang  New DGP  Mangalagiri  CM YS Jagan  YS JaganMohan Reddy  AP Government  Andhra Pradesh  Crime  

Other Articles