తెలంగాణ రాష్ట్ర మాజీ బీజేపి అధ్యక్షుడు, సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డికి కేంద్ర క్యాబినెట్ బర్త్ కన్పామ్ అయ్యింది. ప్రధాని నరేంద్రమోడీ రెండో పర్యాయం పగ్గాలను చేపడుతున్న క్రమంలో కేంద్రమంత్రి పదవులను కూడా ఆచితూచి ఎంపిక చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఎవరెవెవరు ప్రధాని నరేంద్రమోడీతో ప్రమాణ స్వీకారంలో కార్యక్రమంలో పాల్గోనన్నారన్న విషయం ఇవాళ ఉదయం వరకు సస్పెన్స్ కొనసాగినా.. ఇవాళ ఉదయం నుంచి పలు అంచనాలు, పలువురు నేతలకు ఫోన్ సమాచారాలతో తెలిసిపోవడం.. ఇలా కొత్తగా కొలువుదీరనున్న కేంద్ర కొత్త కేబినెట్ లో ఎవరెవరికి స్థానం దక్కిందన్నది తేలిపోయింది.
తెలుగు రాష్ట్రాల నుంచి తెలంగాణ బీజేపీ సీనియర్ నేత, సికింద్రాబాద్ ఎంపీ కిషన్రెడ్డికి ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఫోన్ వచ్చింది. దీంతో కేంద్రమంత్రిగా తెలంగాణ నుంచి కిషన్రెడ్డికి అవకాశం దక్కనుంది. జనతాపార్టీ నుంచి రాజకీయ జీవితం ప్రారంభించిన కిషన్రెడ్డి మూడుసార్లు ఎమ్మెల్యేగా, అసెంబ్లీలో బీజేపీ ఫ్లోర్ లీడర్ గా, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు. ఇటీవల ముగిసిన లోక్ సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందారు. ఈ స్థానం నుంచి పోటీ చేసే సీనియర్ నేత బండారు దత్తాత్రేయకు బదులు కిషన్ రెడ్డిని పార్టీ అధిష్టానం ఎంపిక చేసింది.
కాగా లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించటంతో ప్రధానిగా రెండవసారి నరేంద్ర మోదీ ఇవాళ సాయంత్రం 7 గంటలకు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ క్రమంలో తెలంగాణలో సికింద్రాబాద్, నిజామాబాద్, కరీంనగర్, అదిలాబాద్ ఎంపీ స్థానాలను బీజేపి కైవసం చేసుకుంది. కాగా ధర్మపురి అరవింద్, బండి సంజయ్, సోయం బాబురావుల కన్నా పార్టీలో సీనియర్ కావడంతో పాటు రాష్ట్ర బీజేపిలో కీలక పదవులను అధిరోహించిన కిషన్ రెడ్డికి కేంద్ర క్యాబినెట్ లో స్థానం దక్కింది. ఆయనకు ప్రధాని మంత్రి కార్యాలయం నుంచి ఫోన్ రావటంతో ఈ విషయం ఖాయమైంది. ఇక కిషన్ రెడ్డి ఇప్పటికే ఢిల్లీకి చేరకున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more