Union Cabinet Berth Confirmed for Kishan Reddy సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డికి కేంద్రమంత్రి పదవి

Secundrabad mp kishan reddy union cabinet berth confirmed

Kishan Reddy, Bandaru Dattareya, secundrabad parliamentaty constituency, Union Minister, Cabinet Berth, Union cabinet, PM Modi, amit shah, Telangana, politics

Narendra Modi to take oath as Prime Minister of India for the second time today, along with few Leaders of the party in which secundrabad MP G Kishan Reddy name is also confirmed.

సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డికి కేంద్రమంత్రి పదవి

Posted: 05/30/2019 04:40 PM IST
Secundrabad mp kishan reddy union cabinet berth confirmed

తెలంగాణ రాష్ట్ర మాజీ బీజేపి అధ్యక్షుడు, సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డికి కేంద్ర క్యాబినెట్ బర్త్ కన్పామ్ అయ్యింది. ప్రధాని నరేంద్రమోడీ రెండో పర్యాయం పగ్గాలను చేపడుతున్న క్రమంలో కేంద్రమంత్రి పదవులను కూడా ఆచితూచి ఎంపిక చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఎవరెవెవరు ప్రధాని నరేంద్రమోడీతో ప్రమాణ స్వీకారంలో కార్యక్రమంలో పాల్గోనన్నారన్న విషయం ఇవాళ ఉదయం వరకు సస్పెన్స్ కొనసాగినా.. ఇవాళ ఉదయం నుంచి పలు అంచనాలు, పలువురు నేతలకు ఫోన్ సమాచారాలతో తెలిసిపోవడం.. ఇలా కొత్తగా కొలువుదీరనున్న కేంద్ర కొత్త కేబినెట్ లో ఎవరెవరికి స్థానం దక్కిందన్నది తేలిపోయింది.

తెలుగు రాష్ట్రాల నుంచి తెలంగాణ బీజేపీ సీనియర్ నేత, సికింద్రాబాద్ ఎంపీ కిషన్‌రెడ్డికి ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఫోన్‌ వచ్చింది. దీంతో కేంద్రమంత్రిగా తెలంగాణ నుంచి కిషన్‌రెడ్డికి అవకాశం దక్కనుంది. జనతాపార్టీ నుంచి రాజకీయ జీవితం ప్రారంభించిన కిషన్‌రెడ్డి మూడుసార్లు ఎమ్మెల్యేగా, అసెంబ్లీలో బీజేపీ ఫ్లోర్ లీడర్ గా, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు. ఇటీవల ముగిసిన లోక్ సభ ఎన్నికల్లో సికింద్రాబాద్‌ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందారు. ఈ స్థానం నుంచి పోటీ చేసే సీనియర్ నేత బండారు దత్తాత్రేయకు బదులు కిషన్ రెడ్డిని పార్టీ అధిష్టానం ఎంపిక చేసింది.

కాగా లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించటంతో ప్రధానిగా రెండవసారి నరేంద్ర మోదీ ఇవాళ సాయంత్రం 7 గంటలకు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ క్రమంలో తెలంగాణలో సికింద్రాబాద్, నిజామాబాద్, కరీంనగర్, అదిలాబాద్ ఎంపీ స్థానాలను బీజేపి కైవసం చేసుకుంది. కాగా ధర్మపురి అరవింద్, బండి సంజయ్, సోయం బాబురావుల కన్నా పార్టీలో సీనియర్ కావడంతో పాటు రాష్ట్ర బీజేపిలో కీలక పదవులను అధిరోహించిన కిషన్ రెడ్డికి కేంద్ర క్యాబినెట్ లో స్థానం దక్కింది. ఆయనకు ప్రధాని మంత్రి కార్యాలయం నుంచి ఫోన్ రావటంతో ఈ విషయం ఖాయమైంది. ఇక కిషన్ రెడ్డి ఇప్పటికే ఢిల్లీకి చేరకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kishan Reddy  secundrabad MP  Union Minister  Cabinet Berth  PM Modi  Amit Shah  Telangana  politics  

Other Articles