సైబరాబాద్ పోలీసులు పెట్టిన పోర్జరీ, డాటా చోరి కేసులో తప్పించుకుని తిరుగుతున్న టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ పై మరో కేసు నమోదైంది. నటుడు శివాజీతో కలసి ఏబిసీఎల్ సంస్థ నూతన యాజమాన్యాన్ని ఇబ్బంది పెట్టేందుకు చేసిన ఇరువురు చేసుకున్న లోగుట్టును తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు సేకరించి.. వెలుగులోకి తీసుకువచ్చిన నేపథ్యంలో ఆయనపై మరో కేసు కూడా నమోదు కావడం చర్చనీయాంశంగా మారింది. టీవీ9 సీఈవోగా ఆయన అధికార దుర్వినియోగానికి పాల్పడినట్టు సమాచారం.
తప్పుడు పత్రాలు సృష్టించి టీవీ9 చానల్ కాపీరైట్స్, టీవీ9 కంపెనీ రిజస్టర్ ట్రేడ్ మార్క్ ను టీవీ9 మాజీ డైరెక్టర్లు రవి ప్రకాష్, ఎంవీకేఎన్ మూర్తి, మీడియా ఎన్ఎక్స్ టీ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ కు రూ. 99 వేలకు విక్రయించినట్లు ఏబీసీఎల్ మీడియా డైరెక్టర్ కౌశిక్ రావు బంజారాహిల్స్ పీఎస్ లో కంప్లయింట్ చేశారు. ఇందులో మోజ టీవీ ఎండీ హరికిరణ్ పాత్ర ఉందని.. ముగ్గురిపై కేసులు నమోదు చేయాలని కోరుతూ కౌశిక్ రావు బంజారాహిల్స్ పోలిస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఏబీసీఎల్ లో మెజార్టీ షేర్లను అలంద మీడియా కొనుగోలు చేసినట్లు.. ఈ నేపథ్యంలో టీవీ9 ప్రతిష్టను దెబ్బతీసి.. కంపెనీకి నష్టం తేవాలన్న ఉద్దేశ్యంతో రవి ప్రకాష్..ఎంవీకేఎన్ మూర్తిలు కుట్రకు తెరతీశారని ఫిర్యాదులో తెలిపారు.
కుట్రలో భాగంగా టీవీ9 పాత యాజమాన్యంలో డైరెక్టర్లుగా ఉన్న రవి ప్రకాష్, మూర్తి పాత తేదీలతో తప్పుడు అగ్రిమెంట్ సృష్టించి టీవీ 9 ఛానల్ కంపెనీ కాపీ రైట్స్, టీవీ - 9 కంపెనీ రిజిస్టర్ ట్రేడ్ మార్క్ తో పాటు మరికొన్ని ట్రేడ్ మార్క్ లను మీడియా ఏఎన్ఎక్స్ టి ఇండియా (మోజో టీవీ) ప్రైవేటు లిమిటెడ్కు రూ. 99 వేలకు బదిలీ చేసినట్లు.. 2018 డిసెంబర్ 31 తేదీతో ఒక లావాదేవీ సృష్టించారని పిర్యాదులో తెలిపారు. కంపెనీకి సంబంధించిన రికార్డులను పరిశీలిస్తే.. 2019 ఫిబ్రవరి 28న ఏబీసీఎల్, మీడియా ఏఎన్ఎక్స్ టి ఇండియా (మోజో టీవీ)కి మధ్య రూ. 99 వేలకు లావాదేవీ జరిగినట్టు వెల్లడించారు కౌశిక్. జనవరి 22న కొన్ని రిపేర్లు, మెయింటెనెన్స్ పనులు చేసినందుకు మీడియా ఏఎన్ఎక్స్ టి రూ. 99 వేలు చెల్లించినట్లు ఉందన్నారు. కౌశిక్ రావు ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు బంజారాహిల్స్ పోలీసులు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more