ఈశాన్య రాష్ట్రమైన అసోంలో బాంబు పేలుడు ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. అసోంలోని గౌహతి నగరంలో జరిగిన పేలుడు ఘటనపై దిగ్ర్భాంతి వ్యక్తం చేసిన కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ ఘటన ఎలా సంభవించిందన్న కోణంలో ఆరా తీశారు. అసోం సీఎం సర్బానంద సోనోవాల్ తో ఫోన్ లో మాట్లాడిన మంత్రి రాజ్నాథ్ సింగ్.. పేలుడు ఘటన అనంతరం శాంతిభద్రతల పరిస్థితిపై సమీక్షించారు. ఈ ఘటనకు సంబంధించిన కారణాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారని సర్బానంద రాజ్ నాథ్ సింగ్ కు తెలిపారు. ఈ సందర్భంగా పేలుడులో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ కోరారు.
కాగా గౌహతి నగరంలోని జూ రోడ్డులో షాపింగ్ మాల్ వెలుపల రాత్రి 8 గంటలకు జరిగిన గ్రెనెడ్ పేలుడు ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని గౌహతి పోలీసు కమిషనర్ దీపక్ కుమార్ చెప్పారు. బైక్ పై వచ్చిన ఇద్దరు అగంతకులు అక్కడే పికెట్ నిర్వహిస్తున్న పోలీసులపై గ్రెనెడ్లు విసిరి పారిపోయారని కమిషనర్ దీపక్ కుమార్ తెలిపారు. పేలుడు ఘటన అనంతరం పోలీసులు అప్రమత్తమై ముమ్మరంగా గాలిస్తున్నారు. కాగా ఈ పేలుడులో ఇద్దరు మృతి చెందగా మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.
ఈ గ్రెనేడ్ దాడి తామే చేసినట్లు యూనైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అసోం ప్రకటించుకున్న విషయం తెలిసిందే. గువహాటి లో రద్దీగా ఉండే జూ పార్కు రోడ్డులోని ఓ షాపింగ్ మాల్ వద్ద ఈ ఘటన సంభవించింది. గ్రెనెడ్ పేలుడు ఘటనలో క్షతగాత్రులైన వారిని గువహాటి లోని మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా వున్నట్లు సమాచారం. ఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీం ఆధారాల కోసం ఘటనాస్థలంలో క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more