పశ్చిమ బెంగాల్ లో క్రితం రోజున చోటుచేసుకున్న పరిణామాలపై కేంద్ర ఎన్నికల సంఘం బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించింది. స్వతంత్ర భారతీయ చరిత్రలో ఇదివరకెన్నడూ వినియోగించని అస్త్రాన్ని బయటపెట్టి.. ఎన్నికలంటే ఆశామాషీ కాదని.. రాజకీయ పార్టీలకు షాక్ ఇచ్చింది. ఈ నెల 14న పశ్చిమ బెంగాల్ లో బీజేపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ర్యాలీలో చెలరేగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో అన్ని రాజకీయ పక్షాలకు చెంపపెట్టులాంటి నిర్ణయం తీసుకుంది. తొలిసారిగా అర్టికల్ 324ను ఎన్నికల సంఘం ప్రయోగించింది.
పశ్చిమ బెంగాల్ లో పైచేయి సాధించి తమ సత్తా చాటుకోవాలని ప్రయత్నిస్తున్న బీజేపీకి, అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీలకు మధ్య ఆధిపత్య పోరు నేపథ్యంలో ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. అమిత్ షా ర్యాలీ సందర్భంగా జరిగిన హింసాత్మక ఘటనలకు కారణం ఎవరన్నది పక్కన బెడితే.. అమాయక పార్టీ కార్యకర్తలు రక్తమోడటం సహేతుకం కాదని, ప్రాణనష్టం, అస్తినష్టం లేకుండా ఎన్నికలు సజావుగా సాగాలని నిర్ణయించిన ఈసీ.. అర్టికల్ 324ను ప్రయోగించింది. ఈ చట్టం మేరకు రేపు (గురువారం) రాత్రి పది గంటలకు బెంగాల్ లో ప్రచారానికి స్వస్తి చెప్పాలంటూ అన్ని రాజకీయ పక్షాలను ఆదేశించింది.
ఎన్నికల చరిత్రలోనే మొదటిసారిగా 324 అధికరణ చట్టాన్ని ప్రయోగించింది. ఎన్నికల సంబంధిత దుష్ప్రవర్తనను, అవాంఛనీయ ఘటనలను నివారించడానికి ఈ చట్టం ఉపయోగిస్తారు. కాగా, చివరి దశ పోలింగ్ ఈ నెల 19న జరుగనున్న నేపథ్యంలో 17వ తేదీ సాయంత్రం 5గంటల వరకు ప్రచారానికి సమయం వుంది. అయితే కోల్ కతాలో చోటుచేసుకున్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఒకరోజు ముందుగానే ప్రచారానికి బ్రేకులు వేసింది ఈసీ. కేంద్ర, రాష్ట్ర అధికార పార్టీల మధ్య వున్న విభేదాలు.. అధిపత్య పోరు నేపథ్యంలో ఎలాంటి హింస చెలరేగకుండా ఈ నిర్ణయం తీసుకుంది ఈసి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more