అమరావతిలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ముగిసింది. అయితే ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలను బయటకు వెల్లడించాడానికి వీళ్లులేదని.. ఏ నిర్ణయమైనా ఈసీ అదేశాలతోనే వెల్లడించాలన్న అంక్షలు వున్నాయి. ఇదిలావుంటూ.. ఎన్నికల ముగిసిన తరువాత ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంపై ముఖ్యమంత్రి పలు వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు. అలాంటి పరిణామాల మధ్య క్యాబినెట్ భేటి పెట్టినా సీఎస్ రారా.? అంటూ మంత్రివర్గ సమావేశానికి ఆయన ఒకరకంగా సీఎస్ పై అగ్రహంతోనే ఏర్పాటు చేశారు. అయితే భేటీ సందర్భంగా వీరిద్దరూ నవ్వుతూ మాట్లాడుకోవడం కనిపించడం సహృధ్భావ వాతావరణంలోనే భేటీ జరిగిందన్న వార్తులు వినిపిస్తున్నాయి.,
దీనికి తోడు ఫొని తుఫాన్ సమయంలో సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం పనితీరుపై చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఫొని తుఫాన్ సమయంలో సీఎస్ అద్భుతంగా పనిచేశారంటూ సీఎస్ను చంద్రబాబు అభినందించడం కూడా కొసమెరుపు. రెండు గంటల పాటు సాగిన కేబినెట్ భేటీలో ఉపాధిహామీ పథకం అమలులో దేశంలోనే ఉత్తమ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలదడంపై సంబంధిత అధికారులను అభినందించారు. 5విభాగాల్లో మొదటి స్థానంలో, 6విభాగాల్లో 2వ స్థానంలో ఏపీ నిలిచిందని చంద్రబాబుకు అధికారులు తెలిపారు.
దీంతో సంబంధిత శాఖ అధికారులను చంద్రబాబు అభినందించారు. ఇక భేటి అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. ఫ్రూట్ఫుల్ డిస్కషన్ జరిగిందని, ఫోని తుఫాన్ నష్టం 3కోట్ల 39లక్షలుగా అంచనా వేసినట్లు వెల్లడించారు. అలాగే అధికారులతో తమకు ఎటువంటి ఇబ్బందులు లేవని, అధికారుల సాకారం వల్లే ఐదేళ్లు అభివృద్ధి చేసినట్లు చెప్పారు. ఎన్నికల కోడ్ను అడ్డంపెట్టుకొని ఇబ్బందులు పెట్టాలని చూశారన్నారు. ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు కొత్త విధాన నిర్ణయాలు మాత్రమే తీసుకోకూడదు తప్ప ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు స్పందించడం ప్రభుత్వ బాధ్యత అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more