ప్రచండ భానుడి ఉగ్రరూపానికి దాల్చడంతో వేసవి తాపానికి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. మునుపెన్నడూ లేని విధంగా ఈ సారి ఏకంగా ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల నుంచి 47 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. ఓ వైపు అత్యధిక స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు కావడం.. మరోవైపు వడగాల్పులు వృద్దులు, పిల్లల ఉసురు తీశాయి. ఈ నేపథ్యంలో స్కైమెట్ చల్లని కబరును అందించింది. తెలుగు రాష్ట్రాలలో మరో నెల రోజుల పాటు భానుడి భగభగలు తప్పవని చెప్పింది. ఇదేం చల్లని కబరు అంటున్నారా.?
మరో రెండువారాల్లో నైరుతి రుతు పవనాలు దేశంలోని ప్రకృతి సోంతరాష్ట్రమైన కేరళను పలుకరిస్తాయని స్కైమెట్ అంచనా వేసింది. ఆ తరువాత వారం పది రోజుల్లో రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయని తీపికబురును అందించింది. అయితే అప్పటి వరకు ఎండలు తప్పవని చెప్పింది. ఇది ఒక్కింత చల్లని కబురే అయినా.. అనుకున్న దానికంటే నైరుతి రుతుపవనాలు కొంత అలస్యంగానే కేరళలో ప్రవేశించనున్నాయి. కేరళను తాకిన తరువాత అవి తెలగురాష్ట్రాలకు చేరుకోనున్నాయి.
జూన్ 4న రుతుపవనాలు కేరళను తాకనున్నట్లు స్కైమెట్ అధికారులు తెలిపారు. నైరుతి రాకతో ఈ ఏడాది వర్షాకాలం ప్రారంభమైనట్లు స్కైమెట్ పేర్కొంది. జులై మధ్య నాటికి దేశమంతా వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. దీంతో పంట దిగుబడి కూడా అధికంగా ఉంటుందని పేర్కొంది. ఆర్థిక ప్రగతి కూడా బాగానే ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా సాధారణ వర్ష పాతం నమోదయ్యే ప్రాంతాలు 70 శాతం కన్నా ఎక్కువే ఉన్నట్లు స్కైమెట్ సీఈవో తెలిపారు. దేశానికి 93 శాతం వర్షపాతం ఈ నైరుతి రుతుపవనాల వల్ల కలుగనుంది. రైతాంగం ఎక్కువగా దీనిపైనే ఆధారపడి ఉంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more