నంద్యాల మాజీ ఎంపీ, దివంగత ఎస్పీవై రెడ్డి ఆశయాలను కొనసాగిస్తామని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. 15 ఏళ్లుగా ఆయనతో అనుబంధం ఉందని, ఆయన వ్యక్తిత్వం బాగా నచ్చిందని చెప్పారు. ఆయన ఏ పార్టీలో ఉన్నా.. అందరికీ సుపరిచిత వ్యక్తేనని కొనియాడారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో నంద్యాల లోక్సభ స్థానం నుంచి జనసేన తరఫున పోటీ చేసిన ఎస్పీవై రెడ్డి.. అనారోగ్యంతో బాధపడుతూ కొద్ది రోజుల కిందట కన్నుమూసిన సంగతి తెలిసిందే. శనివారం (మే 11) నంద్యాలలో ఎస్పీవై రెడ్డి నివాసానికి వెళ్లిన పవన్ కళ్యాణ్.. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఎస్పీవై మృతికి పవన్ సంతాపం తెలిపారు. వారి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఇంటి ఆవరణలో ఉన్న ఎస్పీవై రెడ్డి సమాధి వద్ద పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఎస్పీవై రెడ్డి కుటుంబానికి జనసేన పార్టీ అండగా ఉంటుందని, వారిని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటుందని భరోసా ఇచ్చారు. రూపాయికి పప్పు, రొట్టె; రూపాయికి మజ్జిగ; కేవలం రూపాయి అద్దెతో సాగునీటి సరఫరాకు పీవీసీ పైపు, బిందు సేద్యానికి సగం ధరకే సామగ్రి అందించడం మామూలు విషయం కాదని అన్నారు.
సామాన్యుల అలోచనకు కూడా అందని విధంగా వాటిని అమలు చేసి.. ప్రజల మన్నన్నలను అందుకున్న వ్యక్తి ఒక ఎస్పీవై రెడ్డి మాత్రమేనని పవన్ కొనియాడారు. ఒక పారిశ్రామికవేత్త అలా చేయడం గొప్ప విషయమన్నారు. అందుకే ఆయన ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేశారని తెలిపారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తామని తెలిపారు. పవన్ వెంట నాదెండ్ల మనోహర్, మాదాసు గంగాధరం, రామ్మోహన్ రావుతో పాటు కర్నూలు జిల్లా జనసేన నేతలు ఉన్నారు. ఎస్పీవై రెడ్డి మూడుసార్లు నంద్యాల ఎంపీగా ప్రజలకు సేవ చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more