పైన దగా, కింద దగా, కుడి ఎడమల దగా దగా అని మహాకవి శ్రీశ్రీ వెల్లడించినట్లు.. మనిషిని మనిషి దోచుకునే రోజులు ఈ మధ్యకాలంలో అధికమయ్యాయి. తాజాగా ఓ వ్యక్తి తాను అవినీతి నిరోధక శాఖ అధికారిగా చెలామణి అవుతూ.. ప్రజల వద్ద నుంచి లంచాలు వసూలు చేస్తున్నాడు. దీంతో ఓ మహిళకు సాయం చేస్తానని చెప్పి అమెను వేధించడంతో నకిలీ అధికారికి నడిబజారులో సదరు మహిళ చెప్పుతో బుద్ది చెప్పింది. అతని గుట్టు తెలియడంతో అమె రుద్రకాళీగా మారింది. దేహశుద్ది చేసిన అనంతరం పోలీసులకు అప్పగించింది.
ఈ ఘటన జార్ఖండ్ లో జరిగింది. తనకు తానుగా ఏసీబి అధికారినంటూ చెప్పుకుంటూ సమస్యలను పరిష్కారిస్తానని నమ్మబలికిన ఘట్ శీలకు చెందిన ఫణీంద్ర అనే వ్యక్తిని.. పరియస్థుల ద్వారా చేరుకుంది రాఖీ వర్మ అనే మహిళ. వ్యక్తిగత సమస్య విషయంలో పరిష్కారం కోసం సహాయం చేయాలని కోరింది. దీంతో అమెకు సాయం చేస్తానంటూ హామీఇచ్చిన ఫణీంధ్ర మాథ్యూ రూ.50వేలు లంచం అడిగాడు. దీంతో అమెకు కాసింత అనుమానం కలిగింది. ఆ తరువాత ఫణీంధ్ర మాధ్యూ నుంచి పనిచేసి పెట్టాలా వద్దా అని వేధింపులు ప్రారంభమయ్యాయి.
దీంతో తనకు మేలు జరుగుతుందని వెళ్తే.. కీడు జరుగుతుందేంటి అన్న అలోచనలో పడిన రాఖీ వర్మ.. చుట్టుపక్కల ప్రాంతాల వారితో ఈ విషయం గురించి చర్చించి పోలీసులను ఆశ్రయించింది. ముందస్తు ప్రణాళిక ప్రకారం.. లంచం డబ్బు ఇచ్చేందుకు ఓ ప్రాంతానికి రమ్మని నకిలీ అధికారిని రాఖీవర్మ పిలిపించింది. డబ్బుపై ఆశతో అక్కడికి వచ్చిన ఫణీంద్రను ఆమె చెప్పుతో చితకబాదగా.. అప్పటికే అక్కడికి వచ్చిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
#WATCH Jamshedpur: A woman thrashed a man, in Mango area, who posed as an Anti-Corruption Bureau Officer and demanded Rs 50,000 from her. The woman called him on the pretext of giving the money to get him arrested. Police is interrogating the man. #Jharkhand pic.twitter.com/98z9YDHOGd
— ANI (@ANI) May 8, 2019
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more