సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో 50శాతం వీవీప్యాట్ స్లిప్పులను తప్పనిసరిగా లెక్కించేలా కేంద్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ చంద్రబాబు నేృతృత్వంలో 21 విపక్ష పార్టీల నేతలు దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ ను దేశసర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ అంశంలో గతంలో ఇచ్చిన ఆదేశాలను మార్చే ఉద్దేశం తమకు లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది. రివ్యూ పిటిషన్ పై కేవలం నిమిషంలో వాదనలు ముగించిన న్యాయస్థానం తీర్పును వెలువరించింది.
అయితే గతనెల (ఏఫ్రీల్) 8వ తేదీన తాము వెలువరించిన తీర్పు ప్రకారం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కేవలం 5 వీవీప్యాట్ స్లిప్పులను, ప్రతీ పార్లమెంటరీ నియోజకవర్గంలో 35 వీవీప్యాట్ స్లిపులను మాత్రమే ఈవీఎంలలో పోలైన ఓట్లతో లెక్కించాలని అదేశాలను పాటించాలని అదేశించింది. అయితే వీటిలో ఎక్కడైన తేడా కనిపిస్తే మాత్రం ఆ నియోజకవర్గం పూర్తి వీవీప్యాట్ స్లిపులను లెక్కించాలని అత్యున్నత న్యాయస్థానం అదేశించింది. గతంలోనూ ఇదే తీర్పును వెలువరించగా, దానిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టులో రివ్యూ పిటీషన్ ను ప్రతిపక్షాలు దాఖలు చేశాయి.
సుప్రీంకోర్టు తీర్పు అనంతరం మాట్లాడిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు వీవీ ప్యాట్ స్లిప్పుల లెక్కింపు వ్యవహారంలో సుప్రీంకోర్టు నిర్ణయాన్ని గౌరవిస్తామని చంద్రబాబు అన్నారు. కోర్టు నిర్ణయాన్ని గౌరవిస్తూనే న్యాయం కోసం పోరాటం కొనసాగిస్తామన్నారు. న్యాయం జరిగే వరకు పోరాటం ఆపేది లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. 50శాతం వీవీ ప్యాట్ స్లిప్పుల లెక్కింపు విషయంలో మళ్లీ ఈసీ దగ్గరికి వెళతామని చంద్రబాబు చెప్పారు. తమ డిమాండ్ ప్రజల కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే అన్నారు.
ఎన్నికలను ఈసీ పారదర్శకంగా నిర్వహించాలని చంద్రబాబు కోరారు. ఈసీకి జవాబుదారితనం ఉండాలన్నారు. ఈవీఎం, వీవీప్యాట్ లో వ్యత్యాసాలు ఉంటే ఆ నియోజకవర్గం ఓట్లు మొత్తం లెక్కించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలోని అన్ని పద్ధతుల్లో దీనిపై పోరాటం కొనసాగిస్తామని చంద్రబాబు తెలిపారు. కొంత సమయం పట్టినా విశ్వసనీయత, ట్రాన్సపరెన్సీ ముఖ్యం అని అన్నారు. వీవీ ప్యాట్ల వ్యవహారంలో తమకు సహకరించిన వారికి చంద్రబాబు ధన్యవాదాలు చెప్పారు. 21 పార్టీల నేతలు ఒక్కటిగా ఉన్నామన్నారు. న్యాయం సాధించే వరకు కలిసే ఉంటామన్నారు. సుప్రీంకోర్టు అపెక్స్ బాడీ అని, దాని నిర్ణయాన్ని అంతా గౌరవించాలని చంద్రబాబు అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more