కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారికి ఆర్జిత సేవల కోసం నిత్యం లక్షలాది మంది భక్తులు ఎదురుచూస్తుంటారు. కాగా ఇలా ఎదురుచూసే భక్తకోటి కోసం తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతీ నెల తొలి శుక్రవారం రోజున విడుదల చేసే ఆర్జిత సేవా టికెట్లను ఆగస్టు నెల కోటాలో కింద ఇవాళ విడుదల చేసింది. వివిధ అర్జిత సేవలకు సంబంధించిన మొత్తం 67,737 టికెట్లను విడుదల చేసింది. సుప్రభాతం మొదలుకుని దీపాలంకరణ, అర్జిత బ్రోహోత్సవాలు సహా పలు సేవా టికెట్లను భక్తులు అన్ లైన్ విధానంలో తీసుకోవచ్చు.
కాగా, మొత్తం 67, 737 టికెట్లలో ఆన్లైన్ లాటరీ విధానంలో (ఎలక్ట్రానిక్ డిప్ విధానంలో) 11,412 టికెట్లు కేటాయించనున్నట్లు పేర్కొంది. ఈ సేవల కోసం లక్షలాధి మంది భక్తులు పోటీ పడుతున్న క్రమంలో వాటిన్నింటినీ పరిగణలోకి తీసుకునే దేవస్థానం.. వారం రోజుల వరకు అందరి ధరఖాస్తులను తీసుకుని ఆ తరవాత నిర్ధిష్ట సంఖ్యలో టికెట్లను ఎంపిక చేస్తోంది. మొత్తం టికెట్లను దేవస్థానం వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. అత్యధికంగా సహస్ర దీపాలంకరణ సేవ టికెట్లు ఉన్నాయి. ఈ సేవ కోసం మొత్తం 15,600 టికెట్లు కేటాయించారు.
ఆన్లైన్ లాటరీ విధానంలో కేటాయించే టికెట్లలో సుప్రభాత సేవకు 8,117, నిజపాద దర్శనానికి 2,875, అష్టదళ పద్మారాధనకు 180, తోమాల సేవకు 120, అర్చనకు120 టికెట్లు కేటాయించారు. ఇక సాధారణ పద్ధతి కోసం 56,325 టికెట్లను కేటాయించారు. ఇందులో దీపాలంకరణ సేవకు 15,600, వసంతోత్సవానికి 14,300, కల్యాణోత్సవానికి 13,300, ఆర్జిత బ్రహ్మోత్సవానికి 7,425, ఊంజల్ సేవకు 4,200 టికెట్లు, విశేషపూజకు 1,500 టికెట్లు కేటాయించారు. లాటరీ విధానంలో కేటాయించే టికెట్లు పొందేందుకు పేర్ల నమోదుకు నాలుగు రోజుల సమయం ఇచ్చారు. గడువు పూర్తయ్యాక లాటరీ తీసి టికెట్లు కేటాయిస్తారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more